Trends

డెల్టా ప్లస్ వేరియంట్.. ముంబయిలో తొలి మరణం..!

దేశంలో డెల్టా ప్లస్ వేరింయట్ విజృంభణ మొదలైందని అర్థమౌతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మొదలౌతున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా.. తాజాగా తొలి మరణం నమోదైంది. ముంబయిలో ఈ మరణం నమోదు కావడం గమనార్హం.

ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా.. వైరస్‌ సోకిందని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు పేర్కొన్నారు.

మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకి.. ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడిందని వైద్యులు వెల్లడించారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్‌ వేరియంట్‌ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.ఆ మహిళ కుటుంబంలోని ఆరుగురు కూడా కరోనా మహమ్మారి బారీన పడ్డారని తెలిపారు. ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరి కి డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు.

సదరు మహిళ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. ఆమె వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. ప్రాణాలు కోల్పోయిందనే విషయం ఇతరులను భయపెడుతోంది. ఈ క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.

This post was last modified on August 13, 2021 5:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago