దేశంలో డెల్టా ప్లస్ వేరింయట్ విజృంభణ మొదలైందని అర్థమౌతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మొదలౌతున్నాయని నిపుణులు హెచ్చరిస్తుండగా.. తాజాగా తొలి మరణం నమోదైంది. ముంబయిలో ఈ మరణం నమోదు కావడం గమనార్హం.
ముంబై నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ జులై 27 వ తేదీన డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కు గురై మరణించింది. డెల్టా ప్లస్ వేరియంట్ తో మరణించిన మహిళకు రెండు డోసుల టీకాలు వేసినా.. వైరస్ సోకిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు.
మృతురాలికి ఎలాంటి ప్రయాణ చరిత్ర లేకున్నా డెల్టా ప్లస్ వేరియంట్ సోకి.. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడిందని వైద్యులు వెల్లడించారు. మరణించిన మహిళకు డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని తేలినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.ఆ మహిళ కుటుంబంలోని ఆరుగురు కూడా కరోనా మహమ్మారి బారీన పడ్డారని తెలిపారు. ఆరుగురు కరోనా రోగుల్లో ఇద్దరి కి డెల్టా ప్లస్ వేరియంట్ అని జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో తేలిందని బీఎంసీ అధికారులు చెప్పారు.
సదరు మహిళ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం గమనార్హం. ఆమె వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. ప్రాణాలు కోల్పోయిందనే విషయం ఇతరులను భయపెడుతోంది. ఈ క్రమంలో.. డెల్టా ప్లస్ వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.
This post was last modified on August 13, 2021 5:41 pm
గతంలో రీమేక్ అంటే మినిమం గ్యారెంటీ అనే భరోసా ఉండేది. వేరే భాషలో పెద్ద హిట్టయిన సినిమాను తీసుకుని రీమేక్…
మహారాష్ట్రలో మునిసిపల్ కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే ఈ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇక, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు…
సీఎం చంద్రబాబును తిట్టడం ద్వారా గ్రాఫ్ పెరుగుతుందా అనేది ఇప్పుడు టిడిపిలోనూ అటు వైసిపిలోనూ చర్చ నడుస్తోంది. వ్యక్తిగత లాభం…
బాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు ఖాన్ త్రయమే ఆధిపత్యం చలాయించింది. షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య నంబర్ వన్…
కాదేదీ ఫ్యాన్ వార్స్కు అనర్హం అన్నట్లుగా.. సోషల్ మీడియాలో గొడవలు పడడానికి రకరకాల కారణాలు వెతుక్కుంటూ ఉంటారు సినీ అభిమానులు.…
పోయినేడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తెలుగు నుంచి ఒక కళాఖండం రిలీజైంది. దాని పేరు.. లైలా. మన దగ్గర డిజాస్టర్లు…