అప్ఘానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర లేదు. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేసే స్మార్ట్ బౌలర్ గా రషీద్ ఖాన్ కు పేరుంది. అంతేకాదు, లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గానూ రాణిస్తోన్న రషీద్ ఖాన్…ఆల్ రౌండర్ గా తన జట్టు కోసం ప్రాణం పెట్టి ఆడుతుంటాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ లోనూ రాణించిన ఈ అఫ్ఘాన్ ఆల్ రౌండర్ కు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్ లోనూ అభిమానులున్నారు.
అయితే, దేశం కోసం మైదానంలో వీరోచితంగా పోరాడే రషీద్ ఖాన్…ఇపుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తన దేశ ప్రజల కోసం చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాడు. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణ తర్వాత తాలిబన్ల ఆధిపత్యంతో రణరంగంగా మారిన తన దేశాన్ని కాపాడాలంటూ రషీద్ ఖాన్ ప్రపంచ దేశాలను వేడుకుంటున్నాడు. తాలిబన్ల చేతిలో అమాయక ప్రజలు బలవుతున్నారని ఈ యువ ఆటగాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
దేశంలో అల్లకల్లోక పరిస్థితుల వల్ల పసి పిల్లలు, మహిళలు సహా అనేక మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి పరిస్థితుల నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాడు.
తన దేశం అల్లకల్లోలంలో ఉందని, ప్రతి రోజు వేలాదిమంది పిల్లలు, మహిళలు సహా అమాయక ప్రజలు అమరులవుతున్నారుని రషీద్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్ఘాన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాల నేతలకు రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. అమాయక ప్రజల ఇళ్లు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయిని, వేలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయని తమ దేశ ప్రజలను ఈ కల్లోలంలోనే వదిలేయవద్దని, ఆఫ్ఘన్ ప్రజలపై దాడిని, తమ దేశంలో మారణకాండను అడ్డుకొని శాంతి నెలకొల్పాలని రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు, ఇళ్లు కూలిపోయి శరణార్థులుగా మారి ఆకలితో అలమటిస్తోన్న తన దేశ ప్రజలను ఆదుకోవడానికి ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని చేపట్టానని, దానికి విరాళాలు ఇవ్వాలని రషీద్ ఖాన్ రిక్వెస్ట్ చేశాడు.
కాగా, సుదీర్ఘ కాలం ఆఫ్ఘానిస్థాన్ ల పాగా వేసిన తమ బలగాలను అమెరికా, నాటో వెనక్కు పిలిపించుకున్నాయి. అప్పటి నుంచి ఆఫ్ఘానిస్థాన్ అగ్నిగుండంలా మారింది. ఆ దేశానికి దాడులు, అల్లర్లు కొత్త కాకపోయినా..అమెరికా, నాటో దళాలు వెనుదిరిగిన తర్వాత వాటి తీవ్రత పెరిగింది. ఊహించిన దానికంటే అతి తక్కువ సమయంలోనే అఫ్ఘాన్ …తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీంతో, తాలిబన్లు మరోసారి పడగ విప్పారు.
This post was last modified on August 12, 2021 10:15 am
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…
వైసీపీ పాలనలో ప్రజాధనం నీళ్లలా ఖర్చుపెట్టారని, జనం సొమ్మును దుబారా చేయడంలో మాజీ సీఎం జగన్ ఏ అవకాశం వదలలేదని…
మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…