ఆటగాడిగా అయినా, కోచ్గా అయినా తనకు తానే సాటి అని రుజువు చేశాడు లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా అతను సాధించిన ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ కమిటెడ్ క్రికెటర్గా, జట్టు మనిషిగా అతడికి గొప్ప పేరుంది. ఆటగాడిగా కెరీర్ ముగించిన కొన్నేళ్లకే మళ్లీ భారత క్రికెట్కు సేవలందించడం కోసం తిరిగొచ్చేశాడు ద్రవిడ్. అండర్-19, భారత్-ఎ జట్ల కోచ్గా ద్రవిడ్ ఇండియన్ క్రికెట్లో తెచ్చిన మార్పు అసాధారణం.
ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో భారత్ బలమైన శక్తిగా ఎదిగిందంటే.. యువ ఆటగాళ్లు ప్రపంచ వేదికల్లో అదరగొడుతున్నారంటే.. ఓవైపు కోహ్లీసేన ఇంగ్లాండ్లో పర్యటిస్తుంటే.. బీసీసీఐ మరో భారత జట్టును శ్రీలంకకు పంపగలిగిందంటే.. ద్వితీయ శ్రేణి జట్టు అనుకున్న ఆ టీం సైతం వన్డే, టీ20 సిరీస్లు గెలుచుకుని రాగలిగిందంటే.. అందుకు పరోక్షంగా ద్రవిడే కారణం. యువ ఆటగాళ్లను కొన్నేళ్లుగా అంత బాగా తీర్చిదిద్దాడతను.
ఐతే రెండేళ్లుగా ద్రవిడ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బాధ్యతలు చూస్తున్నాడు. అండర్-19, భారత్-ఎ జట్ల కోచ్గా పని చేయట్లేదు కానీ.. ఈ అకాడమీ ద్వారా యువ ఆటగాళ్లను తీర్చిదిద్దుతూనే ఉన్నాడు. అలాగే రీహాబిలిటేషన్ కోసం ఇక్కడికి వచ్చే టీమ్ ఇండియా ఆటగాళ్లకూ సాయపడుతున్నాడు. ఐతే ఇప్పుడు ఎన్సీఏ డైరెక్టర్గా ద్రవిడ్ పదవీ కాలం పూర్తయింది. దీంతో ఈ పదవికి మళ్లీ దరఖాస్తులు కోరుతోంది బీసీసీఐ. ద్రవిడ్ మళ్లీ దానికి దరఖాస్తు చేసుకుంటే అతణ్నే ఆ పదవిలో కొనసాగించడం ఖాయం. కానీ ద్రవిడ్ ఆ పని చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్టోబరు-నవంబరు నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్తో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం పూర్తి కానుంది.
ఇప్పటికే రెండు పర్యాయాలు కోచ్గా పని చేసిన రవిశాస్త్రి తప్పుకోవడం లాంఛనమే అంటున్నారు. అలాంటపుడు ద్రవిడ్ ప్రధాన కోచ్ పదవికి పోటీ పడేందుకు అవకాశముంది. అతను రేసులో నిలిస్తే మిగతా వాళ్లకు అవకాశం లేనట్లే. కానీ టీమ్ ఇండియా కోచ్ కావడానికి గతంలోనూ ఛాన్సున్నా ద్రవిడ్ వద్దనుకున్నాడు. కుటుంబాన్ని విడిచి భారత కోచ్గా పర్యటనలకు తిరుగుతూ ఉండలేనన్నాడు. మరి ఇప్పుడు అతడి ఆలోచన మారిందా.. భారత కోచ్గా కావడానికి సిద్ధమేనా.. లేక ఎన్సీఏ డైరెక్టర్గానే కొనసాగుతాడా అన్నది చూడాలి.
This post was last modified on August 11, 2021 2:28 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…