విశాఖపట్నం నగర శివార్లలోని ఎల్జీ పాలిమర్స్ లో గడచిన ఏడాదిలో స్టైరిస్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన అందరికీ గుర్తుంది కదా. తొందరలోనే ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తి స్ధానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తయారీకి రంగం రెడీ అయిపోయింది. పాలిమర్స్ ఉత్పత్తి చేయటం వల్లే గ్యాస్ లీకైన ఘటనలో 10 మంది చనిపోవటంతో పాటు అనేకమంది తీవ్రంగా అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో ఆ ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది.
నిజానికి ఎప్పుడో 1960లో సంస్ధను ప్రారంభించినపుడు ఎల్జీ పాలిమర్స్ విశాఖకు నగరానికి దూరంగానే ఉండేది. కానీ తర్వాత పరిణామాల్లో పరిశ్రమ చుట్టుపక్కలంతా నగరం బాగా విస్తరించటంతో చివరకు పాలిమర్స్ సంస్ధ జనావాసాల మధ్యలో ఉన్నట్లయిపోయింది. దీనివల్లే గ్యాస్ విడుదలైనపుడు నేరుగా జనాల మీద ప్రభావం చూపింది. ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. అందుకనే వెంకటాపురంలోని పాలిమర్స్ ఉత్పత్తి యూనిట్ ను వెంటనే ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలని డిసైడ్ అయ్యింది.
పాలిమర్స్ ఉత్పత్తి యూనిట్ ను ఖాళీ చేసి ఈ ప్లేసులో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలను ఉత్పత్తి చేయటానికి ఎల్జీ యాజమాన్యం డిసైడ్ అయ్యింది. ఎలక్ట్రానిక్స్ అంటే టీవీలు, మొబైళ్ళు, రెఫ్రిజిరేటర్లు, ల్యాప్ టాపులు, చార్జర్లు తదితరాలన్నమాట. ఇక్కడి నుండి తరలించబోయే పాలిమర్స్ యూనిట్ ను నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం మండలంలో ఏర్పాటు చేయబోతున్నారట.
ప్రభుత్వం చూపించిన స్ధలానికి ఎల్జీ యాజమాన్యం కూడా ఓకే చెప్పిందని సమాచారం. కాబట్టి తొందరలోనే నెల్లూరు జిల్లాకు మరో పరిశ్రమ రావటం ఖాయమైంది. అంటే ఇటు విశాఖ జిల్లా అటు నెల్లూరు జిల్లా ప్రజలు హ్యపీ అనే చెప్పాలి. కాకపోతే మళ్ళీ కృష్ణపట్నంలో యూనిట్ మొదలైన తర్వాత ప్రమాదం జరగకుండా యాజమాన్యం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
This post was last modified on July 22, 2021 7:13 am
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…