తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని జునోనా ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన అనే మహిళ కుటుంబం నివసిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజున కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది.
పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతతో పోరాడింది. ఈ క్రమంలో ఆమెపైనా చిరుత దాడి చేసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి మరి పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు దానిని చితకబాదింది. దీంతో ఏమీ చేయలేక చిరుత అడవుల్లోకి పారిపోయింది. బిడ్డ కోసం ఆ తల్లి చేసిన పోరాటం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది.
This post was last modified on July 19, 2021 10:06 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…