తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని జునోనా ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన అనే మహిళ కుటుంబం నివసిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజున కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది.
పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతతో పోరాడింది. ఈ క్రమంలో ఆమెపైనా చిరుత దాడి చేసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి మరి పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు దానిని చితకబాదింది. దీంతో ఏమీ చేయలేక చిరుత అడవుల్లోకి పారిపోయింది. బిడ్డ కోసం ఆ తల్లి చేసిన పోరాటం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది.
This post was last modified on July 19, 2021 10:06 am
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…