తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని జునోనా ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన అనే మహిళ కుటుంబం నివసిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజున కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది.
పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతతో పోరాడింది. ఈ క్రమంలో ఆమెపైనా చిరుత దాడి చేసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి మరి పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు దానిని చితకబాదింది. దీంతో ఏమీ చేయలేక చిరుత అడవుల్లోకి పారిపోయింది. బిడ్డ కోసం ఆ తల్లి చేసిన పోరాటం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది.
This post was last modified on July 19, 2021 10:06 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…