తల్లి తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎటు వంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డకు హాని జరగకూడదు అనే కోరుకుంటుంది. అలా కాదని.. తన కళ్లముందే ఏదైనా అపాయం జరిగితే.. తన ప్రాణాలు పనంగా పెట్టైనా కాపాడుకుంటుంది. అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఓ మహిళ తన కన్న బిడ్డ ప్రాణాల కోసం ఏకంగా చిరుతపులితో పోరాడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లాలోని జునోనా ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన అనే మహిళ కుటుంబం నివసిస్తుంది. ఈ క్రమంలో ఓ రోజున కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్కు వెళ్లింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది.
పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతతో పోరాడింది. ఈ క్రమంలో ఆమెపైనా చిరుత దాడి చేసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి మరి పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు దానిని చితకబాదింది. దీంతో ఏమీ చేయలేక చిరుత అడవుల్లోకి పారిపోయింది. బిడ్డ కోసం ఆ తల్లి చేసిన పోరాటం ఆ నోటా ఈ నోటా మీడియా దృష్టికి వచ్చింది.
This post was last modified on July 19, 2021 10:06 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…