Trends

రిషబ్ పంత్ కి కరోనా ఎలా సోకిందో తెలుసా?

టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ టాక్ అనే సంస్థ పేరు వెల్ల‌డించింది. క‌రోనా సోకిన భార‌త ఆట‌గాడు రిష‌బ్ పంత్ అని తెలిపింది.

రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం క్వారెంటైన్ లో ఉన్నార‌ని, ల‌క్ష‌ణాలేవీ లేవ‌ని స్పోర్ట్స్ టాక్ వెల్ల‌డించింది. యూరోలో భాగంగా లండ‌న్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జ‌ర్మ‌నీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చూడ‌టానికి పంత్ వెళ్లార‌ని, ఆ స‌మ‌యంలో క‌రోనా సోకి ఉండ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. ఆ ఒక్క‌సారి మాత్ర‌మే పంత్ బ‌యో బ‌బుల్ నుండి బ‌య‌ట‌కొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయ‌ర్‌కు క‌రోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. పేరు బ‌య‌ట‌పెట్ట‌లేదు. 8 రోజులుగా ఐసోలేష‌న్ లో ఉన్నాడ‌ని తెలిపారు. అయితే, మిగ‌తా ప్లేయ‌ర్స్ కు మాత్రం క‌రోనా సోక‌లేద‌ని ధృవీక‌రించారు.

This post was last modified on July 15, 2021 4:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

2 hours ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

3 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

4 hours ago