టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ టాక్ అనే సంస్థ పేరు వెల్లడించింది. కరోనా సోకిన భారత ఆటగాడు రిషబ్ పంత్ అని తెలిపింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారని, లక్షణాలేవీ లేవని స్పోర్ట్స్ టాక్ వెల్లడించింది. యూరోలో భాగంగా లండన్లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లారని, ఆ సమయంలో కరోనా సోకి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ ఒక్కసారి మాత్రమే పంత్ బయో బబుల్ నుండి బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయర్కు కరోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. పేరు బయటపెట్టలేదు. 8 రోజులుగా ఐసోలేషన్ లో ఉన్నాడని తెలిపారు. అయితే, మిగతా ప్లేయర్స్ కు మాత్రం కరోనా సోకలేదని ధృవీకరించారు.
This post was last modified on July 15, 2021 4:38 pm
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…