టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ టాక్ అనే సంస్థ పేరు వెల్లడించింది. కరోనా సోకిన భారత ఆటగాడు రిషబ్ పంత్ అని తెలిపింది.
రిషబ్ పంత్ ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్నారని, లక్షణాలేవీ లేవని స్పోర్ట్స్ టాక్ వెల్లడించింది. యూరోలో భాగంగా లండన్లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లారని, ఆ సమయంలో కరోనా సోకి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ ఒక్కసారి మాత్రమే పంత్ బయో బబుల్ నుండి బయటకొచ్చినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయర్కు కరోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. పేరు బయటపెట్టలేదు. 8 రోజులుగా ఐసోలేషన్ లో ఉన్నాడని తెలిపారు. అయితే, మిగతా ప్లేయర్స్ కు మాత్రం కరోనా సోకలేదని ధృవీకరించారు.
This post was last modified on July 15, 2021 4:38 pm
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు…
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…