Trends

వ్యాక్సిన్ తో కంటిచూపు..!

కరోనా కి మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. కరోనా సోకినా కూడా.. దానిపై పోరాడేందుకు సహాయం చేస్తుంది. అయితే.. ఓ మహిళ విషయంలో మాత్రం.. ఈ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది.

వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం వల్ల 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది.మధురాబాయి జాల్నా జిల్లా పార్టూర్ నివాసి. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది. కంటిశుక్లం తెల్లగా మారడంతో దృష్టి కోల్పోయి చీకటి జీవితాన్ని గడుపుతోంది. కరోనా నివారణ కోసం మధురాబాయి జూన్ 26వతేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుంది. దీంతో తనకు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు వచ్చిందని మధురాబాయి చెప్పారు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో మునిగింది.

This post was last modified on July 6, 2021 10:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

33 minutes ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

39 minutes ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

1 hour ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

2 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago