కరోనా కి మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. కరోనా సోకినా కూడా.. దానిపై పోరాడేందుకు సహాయం చేస్తుంది. అయితే.. ఓ మహిళ విషయంలో మాత్రం.. ఈ కరోనా వ్యాక్సిన్ అద్భుతం చేసింది.
వృద్ధాప్యం కారణంగా కంటి చూపు కోల్పోయి బాధపడుతున్న ఓ మహిళకు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా బెందర్ వాడి గ్రామానికి చెందిన మధురాబాయి బిద్వే అనే 70 ఏళ్ల వృద్ధురాలికి కంటిశుక్లం వల్ల 9ఏళ్ల క్రితం చూపు కోల్పోయింది.మధురాబాయి జాల్నా జిల్లా పార్టూర్ నివాసి. ఆమె తన బంధువులతో కలిసి రిసోడ్ తహసీల్ లో నివాసముంటోంది. కంటిశుక్లం తెల్లగా మారడంతో దృష్టి కోల్పోయి చీకటి జీవితాన్ని గడుపుతోంది. కరోనా నివారణ కోసం మధురాబాయి జూన్ 26వతేదీన కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకుంది. దీంతో తనకు 30 నుంచి 40 శాతం దాకా కంటిచూపు వచ్చిందని మధురాబాయి చెప్పారు. కోవిషీల్డ్ టీకా తీసుకున్న మరుసటి రోజు కంటిచూపు రావడంతో మధురాబాయి సంతోషంలో మునిగింది.
This post was last modified on July 6, 2021 10:06 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…