ఇది దారుణం. దారుణాతి దారుణం. తన కూతురికి బలవంతపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ తండ్రి.. అక్కడ ఉండలేక తన కూతురు పారిపోయిందని తెలిసి ఆమె పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై తన కొడుకులు, ఇతర బంధువులతో కలిసి పాశవిక దాడికి పాల్పడ్డాడు. కన్న బిడ్డ అని కనికరం లేకుండా ఆ అమ్మాయిని ఆ తండ్రి హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరికీ కడుపు తరుక్కుపోయేలా ఉందీ వీడియో. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల గిరిజన యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. ఐతే ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయిన కష్టం మీద మూడు నెలల అత్తారింట్లో గడిపింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఐతే ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చిన తండ్రి, ఆమె సోదరులు దారుణాతి దారుణంగా ప్రవర్తించారు. నలుగురైదురు కలిసి ఆమెను చేతులతో కొడుతూ.. కాళ్లతో తంతూ దారుణంగా హింసించారు. ఇంట్లో, బయట, ఒక పొలంలో.. ఇలా వేర్వేరు ప్రదేశాల్లో ఆమెను హింసించడం వీడియోలో రికార్డయింది. ఎంతకీ కసితీరని వాళ్లు.. చివరికి ఆ అమ్మాయిని తాళ్లతో చెట్టుకు వేలాడదీసి కర్రలతో బాదడం గమనార్హం.
బక్క చిక్కి కనిపిస్తున్న ఆ అమ్మాయి దెబ్బలకు తాళ లేక బోరున ఏడుస్తున్నా.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని వేడుకుంటున్నా ఎవ్వరూ కనికరించలేదు. తమాషాగా నవ్వుతూ ఆమెను చితకబాదడం.. చుట్టూ ఉన్న వాళ్లు కూడా నవ్వుతుండటం అత్యంత దారుణమైన విషయం. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ యువతిని హింసించిన తండ్రి, ఇతర వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లందరికీ పట్టలేని ఆగ్రహం కలుగుతోంది. దాడికి పాల్పడ్డ వారిని అత్యంత కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on July 4, 2021 12:17 pm
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…