ఇది దారుణం. దారుణాతి దారుణం. తన కూతురికి బలవంతపు పెళ్లి చేసి అత్తారింటికి పంపిన ఓ తండ్రి.. అక్కడ ఉండలేక తన కూతురు పారిపోయిందని తెలిసి ఆమె పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై తన కొడుకులు, ఇతర బంధువులతో కలిసి పాశవిక దాడికి పాల్పడ్డాడు. కన్న బిడ్డ అని కనికరం లేకుండా ఆ అమ్మాయిని ఆ తండ్రి హింసించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరికీ కడుపు తరుక్కుపోయేలా ఉందీ వీడియో. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల గిరిజన యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. ఐతే ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయిన కష్టం మీద మూడు నెలల అత్తారింట్లో గడిపింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. ఐతే ఆమె ఆచూకీ కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చిన తండ్రి, ఆమె సోదరులు దారుణాతి దారుణంగా ప్రవర్తించారు. నలుగురైదురు కలిసి ఆమెను చేతులతో కొడుతూ.. కాళ్లతో తంతూ దారుణంగా హింసించారు. ఇంట్లో, బయట, ఒక పొలంలో.. ఇలా వేర్వేరు ప్రదేశాల్లో ఆమెను హింసించడం వీడియోలో రికార్డయింది. ఎంతకీ కసితీరని వాళ్లు.. చివరికి ఆ అమ్మాయిని తాళ్లతో చెట్టుకు వేలాడదీసి కర్రలతో బాదడం గమనార్హం.
బక్క చిక్కి కనిపిస్తున్న ఆ అమ్మాయి దెబ్బలకు తాళ లేక బోరున ఏడుస్తున్నా.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయనని వేడుకుంటున్నా ఎవ్వరూ కనికరించలేదు. తమాషాగా నవ్వుతూ ఆమెను చితకబాదడం.. చుట్టూ ఉన్న వాళ్లు కూడా నవ్వుతుండటం అత్యంత దారుణమైన విషయం. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ యువతిని హింసించిన తండ్రి, ఇతర వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. ఐతే ఈ వీడియో చూసిన వాళ్లందరికీ పట్టలేని ఆగ్రహం కలుగుతోంది. దాడికి పాల్పడ్డ వారిని అత్యంత కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on July 4, 2021 12:17 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…