కొన్ని నెలలుగా సాగుతున్న సందిగ్ధతకు తెరపడినట్లే. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతందనే విషయంలో స్పష్టత వచ్చేసినట్లే. అనుకున్నట్లే భారత్ నుంచి ఈ టోర్నీ తరలిపోనుంది. యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. కొన్ని నెలల ముందు వరకు ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు కథ మారిపోయింది.
ఐపీఎల్ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో టీ20 ప్రపంచకప్ మీదా సందేహాలు మొదలయ్యాయి. గత కొన్ని వారాల్లో కరోనా ఉద్ధృతి చాలా వరకు తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా జూన్ నెలాఖరు లోపు కప్పు నిర్వహణపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని బీసీసీఐకి ఐసీసీ ఇప్పటికే అల్టిమేటం విధించింది. గడువు సమీపిస్తున్నా.. బీసీసీఐ ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉంది.
ఇప్పుడు కరోనా ఉద్ధృతి తగ్గినా.. మళ్లీ వైరస్ ప్రభావం పెరగదని గ్యారెంటీ లేదు. ఇంత అనిశ్చితిలో ఇంత పెద్ద టోర్నీ విషయంలో రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఐసీసీకి విషయం చెప్పలేదు కానీ.. బీసీసీఐ కార్యదర్శి జై షా మాటల్ని బట్టి చూస్తే టోర్నీని తరలించడం లాంఛనమే అని తేలిపోయింది. టీ20 ప్రపంచకప్ భారత్లో జరగదని, యూఏఈలో నిర్వహిస్తామని జై షా మీడియాకు వెల్లడించాడు. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని కూడా తేల్చేశాడు.
ఇక బోర్డు వర్గాల సమాచారం ప్రకారం అక్టోబరు 17న ఈ టోర్నీ మొదలవుతుందట. నవంబరు 14న ఫైనల్ జరుగుతుందట. మధ్యలో ఆగిన ఐపీఎల్ను కూడా యూఏఈలోనే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఐపీఎల్ ముగుస్తుంది. ఐపీఎల్ జరిగే వేదికల్లోనే టీ20 ప్రపంచకప్నూ నిర్వహించనున్నారు.
This post was last modified on June 27, 2021 7:53 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…