కొన్ని నెలలుగా సాగుతున్న సందిగ్ధతకు తెరపడినట్లే. టీ20 ప్రపంచకప్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతందనే విషయంలో స్పష్టత వచ్చేసినట్లే. అనుకున్నట్లే భారత్ నుంచి ఈ టోర్నీ తరలిపోనుంది. యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరగబోతోంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు-నవంబరు నెలల్లో భారత్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సింది. కొన్ని నెలల ముందు వరకు ఈ విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు కథ మారిపోయింది.
ఐపీఎల్ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో టీ20 ప్రపంచకప్ మీదా సందేహాలు మొదలయ్యాయి. గత కొన్ని వారాల్లో కరోనా ఉద్ధృతి చాలా వరకు తగ్గినప్పటికీ.. థర్డ్ వేవ్ గురించి హెచ్చరికలు జారీ అవుతున్న సంగతి తెలిసిందే. కాగా జూన్ నెలాఖరు లోపు కప్పు నిర్వహణపై ఏదో ఒకటి తేల్చి చెప్పాలని బీసీసీఐకి ఐసీసీ ఇప్పటికే అల్టిమేటం విధించింది. గడువు సమీపిస్తున్నా.. బీసీసీఐ ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉంది.
ఇప్పుడు కరోనా ఉద్ధృతి తగ్గినా.. మళ్లీ వైరస్ ప్రభావం పెరగదని గ్యారెంటీ లేదు. ఇంత అనిశ్చితిలో ఇంత పెద్ద టోర్నీ విషయంలో రిస్క్ తీసుకోలేమని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఐసీసీకి విషయం చెప్పలేదు కానీ.. బీసీసీఐ కార్యదర్శి జై షా మాటల్ని బట్టి చూస్తే టోర్నీని తరలించడం లాంఛనమే అని తేలిపోయింది. టీ20 ప్రపంచకప్ భారత్లో జరగదని, యూఏఈలో నిర్వహిస్తామని జై షా మీడియాకు వెల్లడించాడు. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని కూడా తేల్చేశాడు.
ఇక బోర్డు వర్గాల సమాచారం ప్రకారం అక్టోబరు 17న ఈ టోర్నీ మొదలవుతుందట. నవంబరు 14న ఫైనల్ జరుగుతుందట. మధ్యలో ఆగిన ఐపీఎల్ను కూడా యూఏఈలోనే నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆరంభానికి కొన్ని రోజుల ముందు ఐపీఎల్ ముగుస్తుంది. ఐపీఎల్ జరిగే వేదికల్లోనే టీ20 ప్రపంచకప్నూ నిర్వహించనున్నారు.
This post was last modified on June 27, 2021 7:53 am
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…