Trends

అమ్మాయి అని చెప్పి.. హిజ్రాతో పెళ్లి.. రెండు నెలల తర్వాత..!

వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆనందంగా జరిగింది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉందని.. ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ.. అతని ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. పెళ్లి జరిగిన రెండు నెలల తర్వాత… తాను పెళ్లి చేసుకుంది ఓ అమ్మాయిని కాదని.. హిజ్రా అని తెలిసి షాకయ్యాడు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వధూవరులకు తొలిరేయి ఏర్పాటు చేశారు. అయితే.. వారి మధ్య బంధం ఏర్పడలేదు. ఆ తర్వాత వరుడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలించడం లేదు. దీంతో.. సమస్య ఏంటో తెలుసుకోవడానికి భార్యను గైనకాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లాడు.

అక్కడ పరిశీలించిన వైద్యులు… ఇటీవలే ఆమెకు లింగ మార్పిడి జరిగిందని.. కాబట్టి.. ఇంకా జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని.. అసలు విషయం చెప్పేశారు. అంతే.. ఆ వార్త విని అతను షాకయ్యాడు.

తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేలడంతో షాక్ గురైన భర్త అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తి పై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు.

This post was last modified on June 23, 2021 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago