Trends

ఎక్కువ సంతానం ఉంటే.. రూ.లక్ష బహుమతి.. ఓ ట్రోఫి ..!

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో భారత్ ముందుంటుంది. మన దేశంలో.. జనాభా నియంత్రణ చాలా అవసరమన్న విషయం కూడా మనందరికీ తెలుసు. అలాంటిది.. ఎక్కువ సంతానం ఉన్నవారికి రూ.లక్ష బహుమతి అందజేస్తామంటూ మిజోరం రాష్ట్రంలో అధికారికంగా ప్రకటన చేయడం విశేషం.

మిజోరం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్‌తే ఈ మేరకు అధికారిక ప్రకటన చేయడం గమనార్హం. మిజో తెగ జనాభాను పెంచేందుకు ఆయన ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం.

తన నియోజకవర్గంలో అత్యధిక సంతానం ఉన్న కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి రూ. లక్ష రూపాయలను ప్రోత్సాహకంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. దేశంలోని అనేక రాష్ట్రాలు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత తరుణంలో మంత్రి ప్రకటన సంచలనంగా మారింది. ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి రోమవీయా ఈ ప్రకటనను చేశారు.

లబ్ధిదారులు నగదు ప్రోత్సాహకంతో పాటూ ఓ ట్రోఫిని కూడా పొందుతారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఖర్చును మంత్రి తనయుడి ఆధ్వర్యంలో ఉన్న ఓ నిర్మాణ సంస్థ భరిస్తుందని పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సరిపోయే స్థాయిలో మిజోరం జనాభా లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. గిరిజనుల్లో.. మిజోలు లాంటి చిన్న తెగల విషయంలో ఇదో పెద్ద సమస్యగా మారిందని.. అందుకే ఇలాంటి ప్రోత్సహాకాలు అవసరమని మంత్రి రాబర్ట్ వ్యాఖ్యానించారు.

This post was last modified on June 22, 2021 6:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago