ప్రస్తుతం తెలుగు వారికి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేస్తారేమో. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతూ అతను అంతగా మన జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. తన ఆటతోనే కాక చర్యలతోనూ వార్నర్ మన వాళ్లను కట్టి పడేశాడు. టిక్టాక్లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ అతను చేసే సందడి అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్లో అతను తెలుగు బ్లాక్బస్టర్ పాటలతో సోషల్ మీడియాను హోరెత్తించాడు. ఆ తర్వాత ఐపీఎల్కు వచ్చినపుడు కూడా మన వాళ్ల మీద అమితమైన ప్రేమ చూపించాడు. మామూలు సమయాల్లో కూడా వార్నర్ ఇండియా అన్నా, హైదరాబాద్ అన్నా ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంటాడు.
ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు మన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నపుడు, బయట తిరుగుతున్నపుడు తీసిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ naa rendo illu భారతదేశం inka lo naaku annitikanna nache pradesham హైదరాబాద్ అంటూ వ్యాఖ్య జోడించిన వార్నర్.. #family #love #india #home #friends అనే హ్యాష్ ట్యాగ్లను కూడా జోడించాడు.
ఇలా తెలుగు పదాలతో పోస్టు పెట్టడానికి ఇక్కడి వాళ్లు ఎవరో సాయం చేసి ఉండొచ్చు కానీ.. ఇలా మన భాషలో పోస్టు పెట్టాలన్న వార్నర్ ఆలోచనకు మన వాళ్లు ఫిదా అయిపోతున్నారు. మామూలుగానే వార్నర్ను అమితంగా ఇష్టపడే హైదరాబాదీలు.. ఈ పోస్టుతో మరింతగా అతడి అభిమానిస్తారనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనందుకు వార్నర్ను తుది జట్టుకు దూరం పెడితే అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించడం తెలిసిందే.
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…