ప్రస్తుతం తెలుగు వారికి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేస్తారేమో. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతూ అతను అంతగా మన జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. తన ఆటతోనే కాక చర్యలతోనూ వార్నర్ మన వాళ్లను కట్టి పడేశాడు. టిక్టాక్లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ అతను చేసే సందడి అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్లో అతను తెలుగు బ్లాక్బస్టర్ పాటలతో సోషల్ మీడియాను హోరెత్తించాడు. ఆ తర్వాత ఐపీఎల్కు వచ్చినపుడు కూడా మన వాళ్ల మీద అమితమైన ప్రేమ చూపించాడు. మామూలు సమయాల్లో కూడా వార్నర్ ఇండియా అన్నా, హైదరాబాద్ అన్నా ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంటాడు.
ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు మన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నపుడు, బయట తిరుగుతున్నపుడు తీసిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ naa rendo illu భారతదేశం inka lo naaku annitikanna nache pradesham హైదరాబాద్ అంటూ వ్యాఖ్య జోడించిన వార్నర్.. #family #love #india #home #friends అనే హ్యాష్ ట్యాగ్లను కూడా జోడించాడు.
ఇలా తెలుగు పదాలతో పోస్టు పెట్టడానికి ఇక్కడి వాళ్లు ఎవరో సాయం చేసి ఉండొచ్చు కానీ.. ఇలా మన భాషలో పోస్టు పెట్టాలన్న వార్నర్ ఆలోచనకు మన వాళ్లు ఫిదా అయిపోతున్నారు. మామూలుగానే వార్నర్ను అమితంగా ఇష్టపడే హైదరాబాదీలు.. ఈ పోస్టుతో మరింతగా అతడి అభిమానిస్తారనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనందుకు వార్నర్ను తుది జట్టుకు దూరం పెడితే అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించడం తెలిసిందే.
This post was last modified on June 16, 2021 10:13 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…