ప్రస్తుతం తెలుగు వారికి, ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు అత్యంత ఇష్టమైన విదేశీ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా డేవిడ్ వార్నర్ పేరు చెప్పేస్తారేమో. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఆడుతూ అతను అంతగా మన జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయాడు. తన ఆటతోనే కాక చర్యలతోనూ వార్నర్ మన వాళ్లను కట్టి పడేశాడు. టిక్టాక్లో తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ అతను చేసే సందడి అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా గత ఏడాది కరోనా వల్ల తలెత్తిన లాక్ డౌన్లో అతను తెలుగు బ్లాక్బస్టర్ పాటలతో సోషల్ మీడియాను హోరెత్తించాడు. ఆ తర్వాత ఐపీఎల్కు వచ్చినపుడు కూడా మన వాళ్ల మీద అమితమైన ప్రేమ చూపించాడు. మామూలు సమయాల్లో కూడా వార్నర్ ఇండియా అన్నా, హైదరాబాద్ అన్నా ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంటాడు.
ఈ క్రమంలోనే వార్నర్ తాజాగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టు మన వాళ్లందరినీ ఆకట్టుకుంటోంది. ఇండియాలో ఐపీఎల్ ఆడుతున్నపుడు, బయట తిరుగుతున్నపుడు తీసిన కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ naa rendo illu భారతదేశం inka lo naaku annitikanna nache pradesham హైదరాబాద్ అంటూ వ్యాఖ్య జోడించిన వార్నర్.. #family #love #india #home #friends అనే హ్యాష్ ట్యాగ్లను కూడా జోడించాడు.
ఇలా తెలుగు పదాలతో పోస్టు పెట్టడానికి ఇక్కడి వాళ్లు ఎవరో సాయం చేసి ఉండొచ్చు కానీ.. ఇలా మన భాషలో పోస్టు పెట్టాలన్న వార్నర్ ఆలోచనకు మన వాళ్లు ఫిదా అయిపోతున్నారు. మామూలుగానే వార్నర్ను అమితంగా ఇష్టపడే హైదరాబాదీలు.. ఈ పోస్టుతో మరింతగా అతడి అభిమానిస్తారనడంలో సందేహం లేదు. ఈ ఏడాది ఐపీఎల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయనందుకు వార్నర్ను తుది జట్టుకు దూరం పెడితే అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించడం తెలిసిందే.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…