కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ ఆలోచన గ్రేట్ కదా!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్… ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ను తయారుచేసేందుకు ఏడు ఫ్యాక్టరీలు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. గత నెలలో జరిగిన మైక్రోసాఫ్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్‌కు హాజరైన బిల్ గేట్స్… తన సంపాదనలో చాలా భాగం ధాతృత్వ పనుల కోసమే వినియోగించబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టడమే బిల్ గేట్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీని వ్యాక్సిన్ కోసం ఏడు కంపెనీలు పెడతామని… అందులో బెస్ట్ అనుకున్న రెండు వ్యాక్సిన్లను ఫైనల్ ట్రయల్స్ కోసం తీసుకుంటామని చెప్పారు.  అంటే మిగిలిన ఐదు కంపెనీల మీద పెట్టిన పెట్టుబడి మొత్తం వేస్ట్ కాబోతుందన్నమాట. అయితే సమయాన్ని ఆదా చేసేందుకు ఏడు కంపెనీలను నిర్మించబోతున్నట్టు… తెలిపారు గేట్స్.

ధనం కంటే సమయం ముఖ్యమని… ఆలస్యం చేస్తే వేలమంది ప్రాణాలు కోల్పోవచ్చని ఆయన  వివరించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారుచేసి, క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకోవడానికి ఎంత లేదన్నా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందట.

వ్యాక్సిన్ తయారుచేసి ఈ ఏడు కంపెనీల మీద ఆయన కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. దీంతో యూఎస్ ప్రభుత్వం కంటే బిల్ గేట్స్ అంకితభావం అద్భుతమని సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆపదలో అక్కరకు రాని కాసుల కంటే తిరిగిరాని కాలానికి, ప్రాణానికి విలువ ఇవ్వాలనే బిల్ గేట్స్ ఆలోచనా విధానం గ్రేట్ కదా మరి!!

This post was last modified on April 9, 2020 6:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైరల్ గా హోం మినిస్టర్ వీడియో… ఏముందంటే?

ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు…

1 hour ago

బ్రతికుండగానే ఏడడుగుల గోతిలో పాతిపెట్టాడు..

హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంపై కలిగిన కోపంతో ఓ వ్యక్తి యోగా…

1 hour ago

వైరల్: ఆ దేశంలో కోహ్లీ లాంటి నటుడు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పోలినవారి ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. కానీ తాజాగా వైరల్ అయిన…

2 hours ago

సీతక్కకు ఉర్దూ రాదు… నాకు తెలుగు రాదు: అక్బరుద్దీన్ ఓవైసీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. ప్రభుత్వ వాదనలకు విపక్షాల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి.…

2 hours ago

జగన్ పెద్దమ్మ సుశీలమ్మ మృతి

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య కారణాల…

3 hours ago

మరణం అంచున ఉన్న వ్యక్తిని బ్రతికించిన AI

మానవాళికి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం ఎలా ఉంటుందో చాటి చెప్పే ఉదంతం ఇది. అమెరికాలో అరుదైన వ్యాధితో మరణం…

3 hours ago