కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.
అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో కరోనా బారిన పడి కోలుకున్న వారే అధికమని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.
ఇక బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అందులోనూ షుగర్ తో బాధపడుతున్న పురుషులే ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే 12వారాల్లో మరణించే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆద్వర్యంలో దాదాపు 16 వైద్య సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఈ అధ్యయనం జరిగింది.
బ్లాక్ ఫంగస్ ముక్కు, కన్ను, ఊపిరితిత్తులు, ముత్రపిండాలు, చర్మంపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
This post was last modified on June 9, 2021 4:56 pm
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…