కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.
అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో కరోనా బారిన పడి కోలుకున్న వారే అధికమని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.
ఇక బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అందులోనూ షుగర్ తో బాధపడుతున్న పురుషులే ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే 12వారాల్లో మరణించే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆద్వర్యంలో దాదాపు 16 వైద్య సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఈ అధ్యయనం జరిగింది.
బ్లాక్ ఫంగస్ ముక్కు, కన్ను, ఊపిరితిత్తులు, ముత్రపిండాలు, చర్మంపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…