Trends

బ్లాక్ ఫంగస్ కేసులు.. వారిలోనే ఎక్కువ..!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.

అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారే అధిక‌మ‌ని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నార‌ని తాజాగా ఓ అధ్య‌య‌నంలో తేలింది. కోవిడ్ సోక‌ని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.

ఇక బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో షుగ‌ర్ పేషెంట్లు ఎక్కువ‌గా ఉన్నార‌న్నారు. అందులోనూ షుగ‌ర్ తో బాధ‌పడుతున్న పురుషులే ఎక్కువ‌ని ఆ అధ్య‌య‌నం తేల్చింది. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారు స‌రైన స‌మ‌యంలో చికిత్స తీసుకోక‌పోతే 12వారాల్లో మ‌ర‌ణించే అవ‌కాశం ఉంద‌ని ఆ అధ్య‌య‌నం హెచ్చ‌రించింది.

అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ ఆద్వ‌ర్యంలో దాదాపు 16 వైద్య సంస్థ‌లు చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలో ఫ‌స్ట్ వేవ్ ముగిసిన త‌ర్వాత ఈ అధ్య‌య‌నం జ‌రిగింది.

బ్లాక్ ఫంగస్ ముక్కు, క‌న్ను, ఊపిరితిత్తులు, ముత్ర‌పిండాలు, చ‌ర్మంపై ప్ర‌భావం ఎక్కువ‌ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on June 9, 2021 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

32 minutes ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

1 hour ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

2 hours ago

కామారెడ్డిలో ఏం జరుగుతోంది?

కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…

2 hours ago

19 ఏళ్ల త‌ర్వాత‌.. అయేషా అంత్య‌క్రియ‌లు.. ఏం జరిగింది?

అయేషా మీరా. ఉమ్మ‌డి ఏపీలో 2007లో ఓ వ్య‌క్తి కామ దాహానికి బ‌లి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…

5 hours ago

ప్రభాస్ మాట సాయం… కపుల్ నడకలో వేగం

గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…

5 hours ago