Trends

బ్లాక్ ఫంగస్ కేసులు.. వారిలోనే ఎక్కువ..!

కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.

అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారే అధిక‌మ‌ని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నార‌ని తాజాగా ఓ అధ్య‌య‌నంలో తేలింది. కోవిడ్ సోక‌ని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.

ఇక బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారిలో షుగ‌ర్ పేషెంట్లు ఎక్కువ‌గా ఉన్నార‌న్నారు. అందులోనూ షుగ‌ర్ తో బాధ‌పడుతున్న పురుషులే ఎక్కువ‌ని ఆ అధ్య‌య‌నం తేల్చింది. బ్లాక్ ఫంగ‌స్ వ‌చ్చిన వారు స‌రైన స‌మ‌యంలో చికిత్స తీసుకోక‌పోతే 12వారాల్లో మ‌ర‌ణించే అవ‌కాశం ఉంద‌ని ఆ అధ్య‌య‌నం హెచ్చ‌రించింది.

అమెరికాకు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ ఆద్వ‌ర్యంలో దాదాపు 16 వైద్య సంస్థ‌లు చేసిన అధ్య‌య‌నంలో ఈ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. దేశంలో ఫ‌స్ట్ వేవ్ ముగిసిన త‌ర్వాత ఈ అధ్య‌య‌నం జ‌రిగింది.

బ్లాక్ ఫంగస్ ముక్కు, క‌న్ను, ఊపిరితిత్తులు, ముత్ర‌పిండాలు, చ‌ర్మంపై ప్ర‌భావం ఎక్కువ‌ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

This post was last modified on June 9, 2021 4:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago