కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే దేశంలో తగ్గుముఖం పడుతోంది. నాలుగు లక్షల కేసుల నుంచి లక్ష కేసులకు చేరుకున్నాం. అయితే.. కరోనాతోపాటు.. దేశ ప్రజలను బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఈ బ్లాక్ ఫంగస్ కేసులు సైతం వేలల్లో నమోదౌతూనే ఉన్నాయి.
అయితే.. ఈ బ్లాక్ ఫంగస్ ఎక్కువగా పురుషుల మీదే ప్రభావం చూపిస్తోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో కరోనా బారిన పడి కోలుకున్న వారే అధికమని, అందులోనూ పురుషులే 80శాతం మంది ఉన్నారని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ సోకని వారిలోనూ 64శాతం బ్లాక్ ఫంగస్ కేసులు పురుషుల్లోనే ఉన్నాయి.
ఇక బ్లాక్ ఫంగస్ వచ్చిన వారిలో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారన్నారు. అందులోనూ షుగర్ తో బాధపడుతున్న పురుషులే ఎక్కువని ఆ అధ్యయనం తేల్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే 12వారాల్లో మరణించే అవకాశం ఉందని ఆ అధ్యయనం హెచ్చరించింది.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆద్వర్యంలో దాదాపు 16 వైద్య సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత ఈ అధ్యయనం జరిగింది.
బ్లాక్ ఫంగస్ ముక్కు, కన్ను, ఊపిరితిత్తులు, ముత్రపిండాలు, చర్మంపై ప్రభావం ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. దీనిని వెంటనే గుర్తించకుంటే.. 6 నుంచి 12 వారాల్లో మరణించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం రాత్రి మొదలు ఈ రోజు ఉదయాన అందుబాటులోకి వచ్చిన దినపత్రికల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో కొత్త…
పుష్ప సినిమా మొదలైనపుడు దాన్ని ఒక్క పార్ట్గానే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సినిమా మధ్యలో ఉండగా దాన్ని రెండు భాగాలు…
ఇప్పుడు టాలీవుడ్లో ఏదైనా సినిమా వేడుక జరిగిందంటే చాలు.. అందులో పరిశ్రమ కష్టాల గురించి తప్పకుండా ప్రస్తావన ఉంటుంది. తెలుగు…
ఏపీ రాజధాని అమరావతిలో పనుల నిర్మాణం వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేసేందుకు అనేక…
సంచలన తీర్పును వెలువరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. వేశ్యావృత్తికి సంబంధించి చట్టపరమైన స్థితిని.. సెక్స్ వర్కర్ల ప్రాథమిక హక్కులపై…
తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ లెగసీని…