Trends

సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశం.. ‘క‌రోనా అనాథ‌ల’ ద‌త్త‌త వ‌ద్దు!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా ఫ‌స్ట్ వేవ్ క‌న్నా కూడా సెకండ్ వేవ్‌లో వేలాది మంది మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఒకే కుటుంబంలో త‌ల్లిదండ్రులు చ‌నిపోయి.. పిల్ల‌లు మాత్ర‌మే ప్రాణాల‌తో బ‌య‌ట ప‌డిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. క‌రోనాతో త‌ల్లిని, తండ్రిని కోల్పోయి.. అనాథ‌లుగా మిగిలిన చిన్నారుల‌కు రాష్ట్ర‌, కేంద్ర ప్ర‌భుత్వాలు.. బాస‌ట‌గా నిలిచి.. ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇలా అనాథ‌లుగా మారిన వారిని ద‌త్త‌త ఇచ్చేందుకు, తీసుకునేందుకు లేదా ఇలాంటి పిల్ల‌ల‌పై అజ‌మాయిషీ చేసేందుకు.. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కొన్ని ష‌ర‌తులు, నిషేధాలు కూడా విధించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా సుప్రీం కోర్టు .. దేశంలో క‌రోనా బాధిత కుటుంబాల్లో అనాథ‌లుగా మిగిలిన చిన్నారుల విష‌యంపై విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా.. అనాథలైన పిల్లలను చట్ట విరుద్ధంగా దత్తత ఇచ్చే, తీసుకొనే ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. అలాంటి వ్యక్తులపై, స్వచ్ఛంద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

ఈ మేర‌కు న్యాయ‌మూర్తులు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు, జస్టిస్‌ అనిరుధ్‌బోస్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. కొవిడ్‌ కారణంగా అనాథలైన పిల్లల వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్‌ మీడియాలో గానీ మరోచోట గానీ బయటపెట్టరాదని, ఫలానా పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకు రావాలని విజ్ఞప్తులు చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. అనాథ పిల్లల పేర్లను వెల్లడిస్తూ వారి కోసం స్వచ్ఛంద సంస్థలు చందాలు వసూలు చేయరాదని స్పష్టం చేసింది.

This post was last modified on June 9, 2021 3:01 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మల్లీశ్వరి పెట్టిన ‘కోటి’ కష్టాలు

పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…

8 mins ago

గోదావరి తీరంలో ‘గ్యాంగ్’ సమరం

https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…

2 hours ago

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు.…

2 hours ago

వాలెంటైన్ – ఫైటర్ కంటే ఇదే నయం

చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…

4 hours ago

జగన్ బ్యాండేజీ తీసేశాడహో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…

4 hours ago

సుకుమార్ సుహాస్ ఇద్దరూ సేఫ్

యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…

5 hours ago