భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఒక ఉగ్రవాదికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఎండోర్స్ చేయడమే ఇందుక్కారణం. ఐతే తన పోస్టు తీవ్ర దుమారం రేపడంతో హర్భజన్ వెంటనే తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశాడు. బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఖలిస్థాన్ టెర్రరిస్టు బృంద్రాన్వాలే గురించి తనకు ఫార్వర్డ్ అయిన ఒక పోస్టర్ను హర్భజన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశాడు. అందులో బృంద్రాన్వాలే అమర వీరుడని పేర్కొన్నారు. ఐతే ఇండియాకు వ్యతిరేకంగా పని చేయడమే కాక.. 80వ దశకంలో దేశాన్ని విభజించడానికి కుట్రలు పన్నిన ఉగ్రవాది బృంద్రాన్వాలేను అమర వీరుడిగా పేర్కొనడం చాలామందికి నచ్చలేదు. హర్భజన్కు వ్యతిరేకంగా నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. అతణ్ని ట్రోల్ చేశారు. కొందరు జర్నలిస్టులు సైతం ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఐతే ఇది పెద్ద వివాదంగా మారుతుండటంతో హర్భజన్ స్పందించాడు.
తనకు వాట్సాప్లో ఎవరో ఫార్వర్డ్ చేసిన పోస్టును సరి చూసుకోకుండా షేర్ చేశానని.. ఇది ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తీసి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని హర్భజన్ అన్నాడు. తాను క్రికెటర్గా 20 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. అందుకోసం ఎంతో శ్రమించానని.. అలాంటిది దేశానికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడూ చేయనని హర్భజన్ అన్నాడు. దేశానికి వ్యతిరేకంగా పని చేసిన వారికి కూడా మద్దతుగా నిలిచేది లేదని అతను స్పష్టం చేశాడు. హర్భజన్ బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో తెరపడినట్లే అనుకోవాలి. కానీ కొందరు మాత్రం హర్భజన్ కేవలం బృంద్రాన్వాలేపై పోస్టును ఫార్వార్డ్ చేయడంతో సరిపెట్టలేదని, దానికి ‘ప్రణామ్ షహీద్ ను’ అనే కామెంట్ కూడా జోడించాడని, బృంద్రాన్వాలేను అంత గౌరవంగా సంబోధించడమేంటని ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on June 8, 2021 1:58 pm
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…