కొడుకు.. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అది నచ్చని తండ్రి.. ఏకంగా కొడుకు లేని సమయంలో కోడలిని వేరొకరికి అమ్మేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్ర రామ్ కి కి కొడుకు అంటే పంచ ప్రాణాలు. కొడుక్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని అనుకున్నాడు. అయితే.. వీరికి చెప్పకుండా కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. దీంతో… ఆ కోడలిని.. తన కొడుకు జీవితం నుంచి తప్పించాలని అనుకున్నాడు. అందుకోసం ఏకంగా మరో వ్యక్తికి కోడలిని అమ్మేశాడు.
పథకం ప్రకారం.. గుజరాత్కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని బ్రోకర్ల ద్వారా చంద్రరామ్ తెలుసుకున్నాడు. దీంతో తన కోడలిని వాళ్లకు అమ్మాలని నిర్ణయించుకుని 80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ క్రమంలో 40 వేలు అడ్వాన్స్గా తీసుకుని అందులో 20,000 తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తండ్రిని అడగగా, ఏదో అబద్ధం చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత తన ప్లాన్ అమలుపరిచాడు.
తన ఆరోగ్యం సరిగాలేదని తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న బారాబంకిలో ఉంటున్న తండ్రి వద్దకు పంపాడు. జూన్ 5 సాయంత్రం చంద్ర రామ్ తనకి ఆరోగ్యం కుదుట పడిందని ఇంటికి వెళ్లమని కోడలికి తెలిపాడు.
అదే క్రమంలో తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతాడని చెప్పి.. ముందుకు బేరం కుదుర్చుకున్న బ్రోకర్ వెంట కోడలిని పంపించాడు. అయితే భార్య ఎంతకు తన దగ్గరకు రాకపోవడంతంతో వూళ్లోని తన సమీప బంధువు ద్వారా తండ్రి మోసం తెలుసుకున్నాడు ప్రిన్స్. క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సాయంతో బాధితురాలితో కలిసి గుజరాత్కు వెళ్లేందుకు బారాబంకి రైల్వే స్టేషన్లో ఎదురుచూస్తోన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
This post was last modified on June 8, 2021 10:10 am
విపరీతమైన ఆలస్యానికి గురై, అభిమానుల సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన విశ్వంభర విడుదల తేదీ ఇప్పటికీ ఖరారు కాలేదు. రెండు సంక్రాంతులు…
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…