Trends

గేట్స్ లీలలపై మైక్రోసాఫ్ట్ ప్రైవేటు విచారణ


బిల్ గేట్స్ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైనం ఎంతటి సంచలనానికి తెర తీసిందో తెలిసిందే. వీరి విడాకుల ఉదంతం బయటకు వచ్చిన నాటి నుంచి బిల్ గేట్స్ కు సంబంధించి బోలెడన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని అచ్చేసింది. ఇందులో పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించింది.

తమ కంపెనీకి చెందిన ఒక మహిళా ఉద్యోగినితో బిల్ గేట్స్ సన్నిహితంగా మెలిగినట్లుగా పేర్కొంది. దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయం ఆలస్యంగా కంపెనీ ముందుకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. కంపెనీ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న బిల్ గేట్స్ మీద వచ్చిన ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ రహస్యంగా విచారణ జరపటమే కాదు.. అందుకు బయట నుంచి ఒక ఏజెన్సీ సాయాన్ని కూడా తీసుకున్న వైనం తాజాగా బయటకు వచ్చింది.

అయితే.. దీనికి సంబంధించిన విచారణ ఒక కొలిక్కి రాక ముందే బిల్ గేట్స్ కంపెనీ నుంచి తప్పుకోవటం గమనార్హం. సామాజిక సేవా కార్యక్రమాలకోసం మరింత సమయాన్ని వెచ్చించాలన్న ఉద్దేశంతో గత ఏడాది మార్చిలో ఆయన ప్రకటించటం తెలిసిందే. అయితే.. బోర్డు నుంచి తప్పుకోవాలన్న ఆయన నిర్ణయానికి మహిళా ఉద్యోగితో ఆయనకున్న సన్నిహిత సంబంధానికి లింకు లేదని చెబుతున్నారు. ఇరవై ఏళ్ల క్రితమే వీరి వ్యవహారం సానుకూలంగా ముగిసినట్లు చెబుతున్నారు. ఏమైనా.. తమ కంపెనీ సహ వ్యవస్థాపకుడి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అంతర్గతంగా విచారణ జరిపిందన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మరెన్ని అంశాలు తెర మీదకు రానున్నాయో చూడాలి.

This post was last modified on May 18, 2021 10:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago