Trends

కొంత కాలంపాటు వ్యాక్సిన్ల కొరత తప్పదా ?

తాజాగా భారత్ బయోటెక్, సీరమ్ ఫార్మా కంపెనీల యాజమాన్యాలు కేంద్రప్రభుత్వానికి ఇచ్చిన లెక్కల ప్రకారం ఇదే అనుమానం వస్తోంది. జూన్-సెప్టెంబర్ మాసాలకు రెండు కంపెనీల్లో ఏది ఎన్ని డోసులను ఉత్పత్తి చేస్తుందో చెప్పాలని పై రెండు కంపెనీలను కేంద్రం కోరింది. కేంద్రం ప్రశ్నకు ఫార్మా కంపెనీల యాజామాన్యాలు ఉత్పత్తి అంచనాలను వివరించాయి.

ఆగస్టుకి నెలకు 7.82 కోట్ల డోసులకు ఉత్పత్తిని పెంచుతామంటు భారత్ బయోటెక్ (కోవ్యాగ్జిన్) చెప్పింది. అలాగే ఆగస్టునాటికి నెలకు 10 కోట్ల డోసులకు కోవీషీల్డ్ ఉత్పత్తిని పెంచుతామంటు సీరమ్ కంపెనీ కేంద్రానికి మాటిచ్చింది. జూలైలో 3.32 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్ బయోటెక్ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే జూన్ నెలలో ఎన్ని కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ఆగస్టులో 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్లే సెప్టెంబర్ మాసంలో కూడా అంతేమొత్తాన్ని ఉత్పత్తి చేస్తామని సీరమ్ కంపెనీ చెప్పింది. రెండు కంపెనీలు తాజాగా కేంద్రానికి ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే మరికొద్ది నెలలపాటు దేశంలో టీకాల కొరత తప్పేట్లు లేదని అర్ధమైపోతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచుకునే సామర్ధ్యం రెండు ఫార్మా కంపెనీలకు లేకపోవటం, టీకాల తయారీలో అతిముఖ్యమైన ముడిసరుకు విదేశాల నుండి రావాల్సి రావటంతో టీకాల ఉత్పత్తిలో బాగా ఆలస్యమైపోతోంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే టీకాల తయారీలో మరిన్ని కంపెనీలకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో భారత్ బయోటక్ తయారుచేస్తున్న కోవ్యాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకుంటే ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి సూచించారు. విదేశీ కంపెనీలకైనా అనుమతివ్వాలి లేదా ఫార్ములాను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి పెంచే ఏర్పాట్లన్నా చేస్తేనే కానీ ఇప్పిడిప్పుడే అందరికీ టీకాలు సాధ్యంకాదు.

This post was last modified on May 13, 2021 10:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

21 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

40 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago