గత ఏడాది ఇండియాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. అంతకుముందు ఈ పేరుతో ఓ సంస్థ ఉందని తెలియని వాళ్లు కూడా.. కరోనా ధాటికి ఆ సంస్థ ఇచ్చే మార్గదర్శకాలను పాటించడం మొదలుపెట్టారు. దేశంలో కొవిడ్పై పోరులో ఈ సంస్థ ఇచ్చే సూచనలు, మార్గదర్శకాలు ఎంతో కీలకంగా మారాయి.
వాట్సాప్ యూనివర్శిటీ మేధావుల పుణ్యమా అని కోవిడ్ వేళ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న జనాలు.. కరోనాకు సంబంధించి ఏ విషయంలోనైనా ఐసీఎంఆర్ చెప్పినట్లు నడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అదునుగా ఐసీఎంఆర్ లోగో వేసి ఫేక్ ప్రచారాలు చేసేవాళ్లూ లేకపోలేదు. తాజాగా ఐసీఎంఆర్ పేరిట ఒక నోట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ జనాలను మరింత గందరగోళానికి, భయానికి గురి చేసేలా ఉంది ఆ నోట్. రెండేళ్ల పాటు ప్రయాణాలేవీ పెట్టుకోవద్దు. ఆరు నెలల పాటు థియేటర్లు, మాల్స్ వైపు చూడొద్దు. ఏడాది పాటు బయటి తిండి ముట్టుకోవద్దు. శాఖాహారం మాత్రమే తినండి. మాంసాహారం ముట్టుకోవద్దు. హ్యాండ్ కర్చీఫ్ వాడొద్దు… ఇలాంటి సూచనలున్నాయి ఐసీఎంఆర్ పేరిట హల్చల్ చేస్తున్న నోట్లో.
ఇందులో కొన్ని మరీ అతిగా అనిపిస్తుండటంతో జనాలు అయోమయానికి గురవుతున్నారు. జనాలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ నోట్ గురించి ఐసీఎంఆర్ దృష్టికి రావడంతో ట్విట్టర్లో ఆ సంస్థ స్పందించింది. సదరు నోట్ను తమ ట్విట్టర్ పేజీలో షేర్ చేస్తూ ఇది ఫేక్ అని, దీన్ని పట్టించుకోవద్దని స్పష్టం చేసింది. కానీ ఈ లోపే కొందరు ప్రముఖులు సైతం ఈ నోట్ను షేర్ చేసి సర్క్యులేట్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఇది వెళ్లిపోయింది.
This post was last modified on May 7, 2021 9:05 am
బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది…
హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్…
“భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశం. ఇతర దేశాలకు తలవొంచదు. ఎవరో చెప్పినట్టు కూడా నడుచుకోదు. ఎవరి ఆదేశాలనో పాటించాల్సిన…
వచ్చే 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్న విషయం…
యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు…
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా?…