బాహుబలి, కెజిఎఫ్, పుష్ప తర్వాత ఒక సీక్వెల్ కోసం మూవీ లవర్స్ విపరీతంగా ఎదురు చూసిన సినిమా దురంధర్ ది రివెంజ్. మొదటి భాగం రిలీజైనప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వందా రెండు వందలు కాదు ఏకంగా పదమూడు వందల కోట్లు కొల్లగొట్టిన ఆల్ టైం బ్లక్ బస్టర్ గా రణ్వీర్ సింగ్, ఆదిత్య ధార్ చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అందుకే కొనసాగింపు మీద ఇంత ఆసక్తి నెలకొంది.
ఈసారి ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా తెలుగుతో సహా అయిదు ప్రధాన భాషల్లో పార్ట్ 2 రానుంది. ముందు రోజు మార్చి 18 సాయంత్రం నుంచే పెయిడ్ ప్రీమియర్లతో దురంధర్ రివెంజ్ మొదలవుతుంది. ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. రెహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా) చనిపోయాక ఆ సామ్రాజ్యాన్ని పాలించే అవకాశం హంజా (రణ్వీర్ సింగ్)కు దక్కుతుంది. లియరీ డాన్ ప్రాణాలు కోల్పోయాక ఆ ప్రాంతంలో ఏర్పడిన ఊచకోత, రక్తపాతాన్ని హంజా తన చేతుల్లోకి తీసుకుంటాడు.
అయితే ఇండియాలో జస్కిరాత్ సింగ్ రంగి పేరుతో హంజాకో దారుణమైన హింసాత్మకమైన గతం ఉంటుంది. మనుషులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన చరిత్ర నుంచి పాకిస్థాన్ లో జెండా ఎగరేసే స్థాయిలో ఎలా వచ్చాడనేది దురంధర్ రివెంజ్ లో చూపించబోతున్నారు. హంజా అక్కడి నేర సామ్రాజ్యాన్ని, రాజకీయాన్ని ఎలా భూస్థాపితం చేశాడో తెలియాలంటే ఇంకో పదకొండు రోజులు ఆగాలి.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మొత్తం యాక్షన్ విజువల్స్ తో నింపేశారు. మూడు నిమిషాల వీడియోలో చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. కొన్ని అర్థం చేసుకోవాలంటే స్లో మోషన్ పెట్టుకుంటే తప్ప క్యాచ్ చేయలేం. అక్షయ్ ఖన్నా మినహాయించి మిగిలిన పాత్రలన్నీ ఇందులో కంటిన్యూ కాబోతున్నాయి.
శాశ్వత్ సచ్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఊహించినట్టే ఇంటెన్స్ తో కొనసాగింది. మొత్తానికి రికార్డులు బద్దలయ్యే హామీ దురంధర్ ది రివెంజ్ ట్రైలర్ లో కనిపించింది. ఇప్పుడునా హైప్ ని అందుకుంటే మాత్రం ఈసారి రెండు వేల కోట్లు వసూలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాలుగు గంటల ప్యూర్ యాక్షన్ డ్రామాతో ఆదిత్య ధార్ కనువిందు చేయబోతున్నారు.
This post was last modified on March 7, 2026 11:36 am
హారర్, కామెడీ మిక్స్ చేస్తూ రివెంజ్ డ్రామాలో ఒక్క కొత్త ఫార్ములా సృష్టించిన ఘనత హీరో కం దర్శకుడు లారెన్స్…
“భారత దేశం సర్వసత్తాక సార్వభౌమ దేశం. ఇతర దేశాలకు తలవొంచదు. ఎవరో చెప్పినట్టు కూడా నడుచుకోదు. ఎవరి ఆదేశాలనో పాటించాల్సిన…
వచ్చే 15 ఏళ్లపాటు కూటమి అధికారంలో ఉండాలని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బలంగా చెబుతున్న విషయం…
యుద్ధం.. అక్కడి వారిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపితే.. మనపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తోంది. గ్యాస్, పెట్రోల్ ధరలు. పెరుగుతాయని నిపుణులు…
2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా?…
సోషల్ మీడియా యావలో పడిన చాలా మంది యువకులు, యవతులు తమ ప్రాణాలను కూడా బలి చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఇలాంటి…