భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే.
మరి.. రెండో వేవ్ లో ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు వాడక తప్పని పరిస్థితి. ఈ విషయంపై నిపుణులు చెబుతున్నా.. ఆ తీరును ఫాలో అయ్యే ప్రముఖుల్ని చూసింది లేదు. అందుకు భిన్నంగా అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు.. ఆ దేశాన్ని కరోనా బారి నుంచి బయట పడేసేందుకు శ్రమించి.. సక్సెస్ అయిన ఆంటోనీ ఫౌచీకి సంబంధించిన తాజా ఫోటో ఒకటి ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ఎందుకంటే.. ఆయన తన ముఖానికి ఒకటి కాదు.. రెండు మాస్కులు పెట్టుకోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
కరోనా 2.0 వేళ.. ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు అవసరమన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. మొదటి మాస్కు సర్జికల్ మాస్కు.. దాని పైన వస్త్రంతో చేసిన మాస్కుసరిపోతుందని చెబుతున్నారు. రెండు మాస్కులతో ముఖాన్ని కవర్ చేయటం ద్వారా.. కరోనా బారిన పడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. మరింత రక్షణ కోసం డబుల్ మాస్కును ధరించటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మొదటి మాస్కుతో ఎవైనా ఖాళీలు మిగిలిపోతే.. వైరస్ సోకే వీలుంది. అందుకు భిన్నంగా రెండు మాస్కులు పెట్టుకోవటం ద్వారా.. ముఖం మొత్తాన్ని కప్పేసే వీలుందని చెబుతున్నారు. ఫౌచీ లాంటి నిపుణుడే.. తన ముఖానికి డబుల్ మాస్కు పెట్టుకొని ఫోటో దిగటమే కాదు.. దాన్నే ఫాలో అవుతున్న వేళ..మాస్కు రూల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 26, 2021 8:22 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…