భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే.
మరి.. రెండో వేవ్ లో ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు వాడక తప్పని పరిస్థితి. ఈ విషయంపై నిపుణులు చెబుతున్నా.. ఆ తీరును ఫాలో అయ్యే ప్రముఖుల్ని చూసింది లేదు. అందుకు భిన్నంగా అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు.. ఆ దేశాన్ని కరోనా బారి నుంచి బయట పడేసేందుకు శ్రమించి.. సక్సెస్ అయిన ఆంటోనీ ఫౌచీకి సంబంధించిన తాజా ఫోటో ఒకటి ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ఎందుకంటే.. ఆయన తన ముఖానికి ఒకటి కాదు.. రెండు మాస్కులు పెట్టుకోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
కరోనా 2.0 వేళ.. ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు అవసరమన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. మొదటి మాస్కు సర్జికల్ మాస్కు.. దాని పైన వస్త్రంతో చేసిన మాస్కుసరిపోతుందని చెబుతున్నారు. రెండు మాస్కులతో ముఖాన్ని కవర్ చేయటం ద్వారా.. కరోనా బారిన పడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. మరింత రక్షణ కోసం డబుల్ మాస్కును ధరించటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మొదటి మాస్కుతో ఎవైనా ఖాళీలు మిగిలిపోతే.. వైరస్ సోకే వీలుంది. అందుకు భిన్నంగా రెండు మాస్కులు పెట్టుకోవటం ద్వారా.. ముఖం మొత్తాన్ని కప్పేసే వీలుందని చెబుతున్నారు. ఫౌచీ లాంటి నిపుణుడే.. తన ముఖానికి డబుల్ మాస్కు పెట్టుకొని ఫోటో దిగటమే కాదు.. దాన్నే ఫాలో అవుతున్న వేళ..మాస్కు రూల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 26, 2021 8:22 am
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…
పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…