భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే.
మరి.. రెండో వేవ్ లో ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు వాడక తప్పని పరిస్థితి. ఈ విషయంపై నిపుణులు చెబుతున్నా.. ఆ తీరును ఫాలో అయ్యే ప్రముఖుల్ని చూసింది లేదు. అందుకు భిన్నంగా అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు.. ఆ దేశాన్ని కరోనా బారి నుంచి బయట పడేసేందుకు శ్రమించి.. సక్సెస్ అయిన ఆంటోనీ ఫౌచీకి సంబంధించిన తాజా ఫోటో ఒకటి ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ఎందుకంటే.. ఆయన తన ముఖానికి ఒకటి కాదు.. రెండు మాస్కులు పెట్టుకోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
కరోనా 2.0 వేళ.. ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు అవసరమన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. మొదటి మాస్కు సర్జికల్ మాస్కు.. దాని పైన వస్త్రంతో చేసిన మాస్కుసరిపోతుందని చెబుతున్నారు. రెండు మాస్కులతో ముఖాన్ని కవర్ చేయటం ద్వారా.. కరోనా బారిన పడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. మరింత రక్షణ కోసం డబుల్ మాస్కును ధరించటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మొదటి మాస్కుతో ఎవైనా ఖాళీలు మిగిలిపోతే.. వైరస్ సోకే వీలుంది. అందుకు భిన్నంగా రెండు మాస్కులు పెట్టుకోవటం ద్వారా.. ముఖం మొత్తాన్ని కప్పేసే వీలుందని చెబుతున్నారు. ఫౌచీ లాంటి నిపుణుడే.. తన ముఖానికి డబుల్ మాస్కు పెట్టుకొని ఫోటో దిగటమే కాదు.. దాన్నే ఫాలో అవుతున్న వేళ..మాస్కు రూల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…