భయంతో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటాం. సమస్య ఏమంటే.. భయం కూడా ఒక అలవాటుగా మారితే.. అప్రమత్తత అంతకంతకూ తగ్గుతుంది. ఇదే సైకాలజీ కరోనా 2.0 కొత్త సమస్యల్ని తీసుకురావటమే కాదు.. రోజు గడిచేసరికి లక్షలాది మందిని కరోనా బారిన పడేలా చేస్తోంది. ఇలాంటివేళ.. కొన్ని నిబంధనల్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. మొదటి వేవ్ లో.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం అలవాటైన సంగతి తెలిసిందే.
మరి.. రెండో వేవ్ లో ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు వాడక తప్పని పరిస్థితి. ఈ విషయంపై నిపుణులు చెబుతున్నా.. ఆ తీరును ఫాలో అయ్యే ప్రముఖుల్ని చూసింది లేదు. అందుకు భిన్నంగా అమెరికా అంటువ్యాధుల నిఫుణుడు.. ఆ దేశాన్ని కరోనా బారి నుంచి బయట పడేసేందుకు శ్రమించి.. సక్సెస్ అయిన ఆంటోనీ ఫౌచీకి సంబంధించిన తాజా ఫోటో ఒకటి ప్రపంచానికి మార్గదర్శకంగా మారింది. ఎందుకంటే.. ఆయన తన ముఖానికి ఒకటి కాదు.. రెండు మాస్కులు పెట్టుకోవటం ఆసక్తికరంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.
కరోనా 2.0 వేళ.. ముఖానికి ఒక మాస్కు కాదు.. రెండు మాస్కులు అవసరమన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెబుతున్నారు. మొదటి మాస్కు సర్జికల్ మాస్కు.. దాని పైన వస్త్రంతో చేసిన మాస్కుసరిపోతుందని చెబుతున్నారు. రెండు మాస్కులతో ముఖాన్ని కవర్ చేయటం ద్వారా.. కరోనా బారిన పడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త రకాలు వెలుగు చూస్తున్న వేళ.. మరింత రక్షణ కోసం డబుల్ మాస్కును ధరించటం తప్పనిసరి అని చెబుతున్నారు.
మొదటి మాస్కుతో ఎవైనా ఖాళీలు మిగిలిపోతే.. వైరస్ సోకే వీలుంది. అందుకు భిన్నంగా రెండు మాస్కులు పెట్టుకోవటం ద్వారా.. ముఖం మొత్తాన్ని కప్పేసే వీలుందని చెబుతున్నారు. ఫౌచీ లాంటి నిపుణుడే.. తన ముఖానికి డబుల్ మాస్కు పెట్టుకొని ఫోటో దిగటమే కాదు.. దాన్నే ఫాలో అవుతున్న వేళ..మాస్కు రూల్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు.
This post was last modified on April 26, 2021 8:22 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…