Trends

కొవిడ్ కల్లోలం.. హృదయం ద్రవించే ఒక ఫొటో

మనిషి చనిపోతే వారిని ఈ లోకం నుంచి సాగనంపే విషయం ప్రతి మతానికీ ఓ సంప్రదాయం ఉంటుంది. సంప్రదాయాలను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి ఖననం చేస్తేనే చనిపోయిన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు ఆయా మతస్థులు. చివరి గడియల్లో వెంట ఉండాలని.. చనిపోయిన మనిషిని చివరి చూపు చూసుకోవాలని.. దగ్గరుండి ఆ వ్యక్తికి వీడ్కోలు పలకాలని కుటుంబ సభ్యులే కాదు.. సన్నిహితులందరూ ఆశిస్తారు. వీటన్నింటికీ అవకాశం ఇవ్వని బాధాకరమైన చావును ఇస్తుంది కరోనా.

వైరస్ సోకిన వ్యక్తి దగ్గరికి ఎవరూ వెళ్లలేరు. ఇక ఆ వ్యక్తి చనిపోతే.. కుటుంబ సభ్యులు కూడా దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉండదు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించరు. సంప్రదాయ రీతిలో అంత్యక్రియలు చేయనివ్వరు. అనాథ శవంలా తీసుకెళ్లి సామూహిక ఖననం చేయాల్సిన దుస్థితి.

కనీసం శ్మశాన వాటికలో ఒక పద్ధతి ప్రకారం మృతదేహాన్ని ఖననం చేసే పరిస్థితి కూడా లేక ఖాళీ ప్రదేశాలు చూసి సామూహిక ఖననాలు చేసేస్తున్న పరిస్థితులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల నెలకొన్నాయి. అసలే శ్మశాన వాటికల కొరత ఉన్న పెద్ద నగరాల్లో పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కరోనా మృతుల ఖననం జరుగుతున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోక మానదు. దేశ రాజధాని ఢిల్లీలో తీసిన ఒక ఫొటో చూస్తే.. పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది.

ఏరియల్ వ్యూలో తీసిన ఆ ఫొటోలో.. ఒక ఖాళీ ప్రదేశంలో ఒక్కో మృత దేహానికి కొన్ని అడుగుల ఖాళీ వదిలి ఒకేసారి దహనం చేస్తున్న దృశ్యం కనిపిస్తోంది. పదుల సంఖ్యలో మృతదేహాలు దహనం అవుతున్నాయి. ఇలా ఒకేసారి అన్నిమృత దేహాల్ని ఒకే చోట కాల్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే కరోనా ఏ స్థాయిలో విలయ తాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫొటో చూస్తే ఒళ్లు జలదరించడం, హృదయం ద్రవించడం ఖాయం.

This post was last modified on April 23, 2021 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

4 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

6 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

6 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago