గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారతీయులకు గొప్ప ఉపశమాన్నిచ్చిన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. కొన్ని నెలల పాటు బయటకు అడుగు పెట్టే అవకాశం లేక బయట అన్ని రకాల వినోదాలు దూరమైన సమయంలో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి అభిమానులను మురిపించింది. గాయపడ్డ భారతీయుల హృదయాలకు ఆ టోర్నీ మందేసిందనడంలో సందేహం లేదు.
ఈసారి యధావిధిగా వేసవిలోనే.. అది కూడా స్వదేశంలోనే లీగ్ను నిర్వహించడానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎందుకైనా మంచిదని ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. కానీ టోర్నీ దగ్గర పడుతుండగా ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లీగ్ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటిదాకా ఐపీఎల్తో ముడిపడ్డ వాళ్లలో 40 మందికి పైగా కరోనా బారిన పడటం గమనార్హం.
ముంబయిలో ఎప్పుడూ కూడా కరోనా తగ్గుముఖం పట్టింది లేదు. అయినా సరే.. అక్కడ ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టి కూర్చున్నందుకు బీసీసీఐ ఇప్పుడు తల పట్టుకుంటోంది. వాంఖడె మైదాన సిబ్బందిలోనే పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అక్కడే స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్కాస్టింగ్ సిబ్బంది 15 మంది దాకా పాజిటివ్గా తేలారు.
ఇదంతా ఒకెత్తయితే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిలో కూడా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళనను పెంచుతోంది. ముందు అక్షర్ పటేల్.. ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో పడిక్కల్ కోలుకున్నాడు. అక్షర్ ఐసొలోషన్లో ఉన్నాడు. తాజాగా బెంగళూరు ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా పాజిటివ్గా తేలాడు. అతడి కంటే ముందు ముంబయి ఇండియన్స్ కోచ్ల్లో ఒకడైన కిరణ్ మోరె వైరస్ బారిన పడ్డారు. సామ్స్, కిరణ్ బయో బబుల్ లోపల ఉన్నా కూడా కరోనా బారిన పడటాన్ని బట్టి.. బబుల్ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బబుల్ లోపలి వాళ్లు కరోనా బారిన పడ్డారంటే.. వైరస్ వ్యాప్తి ఇంతటితో ఆగుతుందని చెప్పలేం.
ఇలా కేసులు పెరుగుతూ పోబట్టే గత నెలలో పాకిస్థాన్ సూపర్ లీగ్ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి శుక్రవారం ఐపీఎల్ మొదలుపెట్టడానికి సర్వం సిద్ధమైంది కానీ.. మున్ముందు కేసులు మరిన్ని బయటపడితే మాత్రం టోర్నీ ముందుకు సాగడం కష్టమే.
కొన్నేళ్ల ముందు వరకు తెలుగులో రాశి ఖన్నా కెరీర్ మంచి ఊపులో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు స్టార్…
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…