Trends

ఐపీఎల్ నడుస్తుందా.. మధ్యలో ఆగిపోతుందా?

గత ఏడాది కరోనా దెబ్బకు తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారతీయులకు గొప్ప ఉపశమాన్నిచ్చిన టోర్నీ ఇండియన్ ప్రిమియర్ లీగ్. కొన్ని నెలల పాటు బయటకు అడుగు పెట్టే అవకాశం లేక బయట అన్ని రకాల వినోదాలు దూరమైన సమయంలో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌ ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగి అభిమానులను మురిపించింది. గాయపడ్డ భారతీయుల హృదయాలకు ఆ టోర్నీ మందేసిందనడంలో సందేహం లేదు.

ఈసారి యధావిధిగా వేసవిలోనే.. అది కూడా స్వదేశంలోనే లీగ్‌ను నిర్వహించడానికి బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎందుకైనా మంచిదని ఖాళీ స్టేడియాల్లో టోర్నీ నిర్వహించడానికి బీసీసీఐ నిర్ణయించింది. కానీ టోర్నీ దగ్గర పడుతుండగా ఆందోళనకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లీగ్‌ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటిదాకా ఐపీఎల్‌తో ముడిపడ్డ వాళ్లలో 40 మందికి పైగా కరోనా బారిన పడటం గమనార్హం.

ముంబయిలో ఎప్పుడూ కూడా కరోనా తగ్గుముఖం పట్టింది లేదు. అయినా సరే.. అక్కడ ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టి కూర్చున్నందుకు బీసీసీఐ ఇప్పుడు తల పట్టుకుంటోంది. వాంఖడె మైదాన సిబ్బందిలోనే పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు. అక్కడే స్టార్ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది 15 మంది దాకా పాజిటివ్‌గా తేలారు.

ఇదంతా ఒకెత్తయితే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిలో కూడా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళనను పెంచుతోంది. ముందు అక్షర్ పటేల్.. ఆ తర్వాత దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. వీరిలో పడిక్కల్ కోలుకున్నాడు. అక్షర్ ఐసొలోషన్లో ఉన్నాడు. తాజాగా బెంగళూరు ఆటగాడు డేనియల్ సామ్స్ కరోనా పాజిటివ్‌గా తేలాడు. అతడి కంటే ముందు ముంబయి ఇండియన్స్ కోచ్‌ల్లో ఒకడైన కిరణ్ మోరె వైరస్ బారిన పడ్డారు. సామ్స్, కిరణ్ బయో బబుల్ లోపల ఉన్నా కూడా కరోనా బారిన పడటాన్ని బట్టి.. బబుల్‌ ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బబుల్ లోపలి వాళ్లు కరోనా బారిన పడ్డారంటే.. వైరస్ వ్యాప్తి ఇంతటితో ఆగుతుందని చెప్పలేం.

ఇలా కేసులు పెరుగుతూ పోబట్టే గత నెలలో పాకిస్థాన్ సూపర్ లీగ్‌ను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికి శుక్రవారం ఐపీఎల్ మొదలుపెట్టడానికి సర్వం సిద్ధమైంది కానీ.. మున్ముందు కేసులు మరిన్ని బయటపడితే మాత్రం టోర్నీ ముందుకు సాగడం కష్టమే.

This post was last modified on April 8, 2021 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

OG 2 వెనుక గూఢచారి హస్తం ?

అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…

8 minutes ago

రోజా, బైరెడ్డిలకు కష్గాలు… ఏం జరుగుతోంది?

ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…

1 hour ago

నాని నమ్మకానికి ప్రీమియర్ల పరీక్ష

నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…

1 hour ago

సాయిరెడ్డి వంతు వచ్చేసింది!

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…

2 hours ago

అమ‌రావ‌తి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నాయ‌కులు సృష్టిస్తున్న విషప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు నమ్మ‌రాద‌ని ఏపీ మంత్రులు కోరారు. రాజ‌ధాని…

3 hours ago

అసంత్రుప్తివున్నా జగన్ వైపు వెళ్ళట్లేదుగా

సాధార‌ణంగా ఒక రాజ‌కీయ పార్టీ విఫ‌ల‌మైతే.. ఆ పార్టీ న‌ష్ట‌పోవ‌డమే కాదు.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా బ‌లోపేతం అవుతాయి. ఇప్పుడు…

5 hours ago