వినేందుకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి.. పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి.
మాస్కు పెట్టుకోని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టే వీలుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 నుంచి 60 ప్రకారమైతే ఏకంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుంది. అదే.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తే ఆర్నెల్లు జైలుశిక్ష లేదంటే వెయ్యి వరకు జరిమానా విధించే వీలుంది. కొన్ని సందర్భాల్లో రెండూ శిక్షల్ని కలిపి వేసే వీలుంది.
తెలంగాణకు ఇరుగుపొరుగున్న రాష్ట్రాలతో పోలిస్తే.. అక్కడ విధించే శిక్షలతో పోలిస్తే.. తెలంగాణలోనే ఎక్కువ. ఏపీలో మాస్కుధరించని వారికి రూ.250 చొప్పున ఫైన్ వేస్తున్నారు. మహారాష్ట్రలో మాస్కు లేకుంటే రూ.వెయ్యి ఫైన్ వేస్తున్నారు. రెండోసారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ.3వేలు.. మూడోసారి పట్టుబడితే రూ.5వేల ఫైన్ వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్కు లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.
తెలంగాణలో ఫైన్ తో పాటు.. జైలుశిక్ష వేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. మాస్కు లేకుండా వెళ్లే వారిని గుర్తించేందుకు వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా వ్యక్తుల్ని గుర్తించి ఫైన్లు..శిక్షలు విధించే వీలుంది. సో.. మాస్కు లేకుండా బయటకు వస్తే ఏమవుతుందని లైట్ తీసుకుంటే.. భారీ ఫైన్ మాత్రమే కాదు.. జైలుశిక్ష ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బీ కేర్ ఫుల్.
This post was last modified on March 30, 2021 11:30 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…