వినేందుకు విచిత్రంగా అనిపించినప్పటికి ఇది నిజం. మాస్కు పెట్టుకోకుండా బయటకు వెళ్లి.. పట్టుబడితే రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తుంది. మాస్కు పెట్టుకోకుంటే జరిమానాలే విన్నాం కానీ.. ఈ జైలు మాటేమిటి? కొత్తగా అనుకుంటున్నారా? మాస్కుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి.
మాస్కు పెట్టుకోని వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టే వీలుంది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ 2005 సెక్షన్ 51 నుంచి 60 ప్రకారమైతే ఏకంగా రెండేళ్ల వరకు జైలుశిక్ష పడే వీలుంది. అదే.. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేస్తే ఆర్నెల్లు జైలుశిక్ష లేదంటే వెయ్యి వరకు జరిమానా విధించే వీలుంది. కొన్ని సందర్భాల్లో రెండూ శిక్షల్ని కలిపి వేసే వీలుంది.
తెలంగాణకు ఇరుగుపొరుగున్న రాష్ట్రాలతో పోలిస్తే.. అక్కడ విధించే శిక్షలతో పోలిస్తే.. తెలంగాణలోనే ఎక్కువ. ఏపీలో మాస్కుధరించని వారికి రూ.250 చొప్పున ఫైన్ వేస్తున్నారు. మహారాష్ట్రలో మాస్కు లేకుంటే రూ.వెయ్యి ఫైన్ వేస్తున్నారు. రెండోసారి అదే తప్పు చేసి పట్టుబడితే రూ.3వేలు.. మూడోసారి పట్టుబడితే రూ.5వేల ఫైన్ వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మాస్కు లేని వారికి రూ.500 ఫైన్ వేస్తున్నారు.
తెలంగాణలో ఫైన్ తో పాటు.. జైలుశిక్ష వేసేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. మాస్కు లేకుండా వెళ్లే వారిని గుర్తించేందుకు వీధుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్ని సైతం వినియోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా వ్యక్తుల్ని గుర్తించి ఫైన్లు..శిక్షలు విధించే వీలుంది. సో.. మాస్కు లేకుండా బయటకు వస్తే ఏమవుతుందని లైట్ తీసుకుంటే.. భారీ ఫైన్ మాత్రమే కాదు.. జైలుశిక్ష ప్రమాదం పొంచి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. బీ కేర్ ఫుల్.
This post was last modified on March 30, 2021 11:30 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…