ప్రపంచాన్ని కరోనా వైరస్ ఇప్పట్లో వదిలేట్లు కనబడటం లేదు. ఒకరూపం కాకపోతే మరోరూపంలో విజృభిస్తునే ఉంది. తాజాగా 8 దేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ విధించారంటేనే పరిస్ధితి ఎంత భయంకరంగా ఉందో అర్ధమైపోతోంది. సౌదీ అరేబియా, టాంజానియా, బ్రెజిల్, యూకే, ఫ్రాన్స్ , ఇటలీ, స్పెయిన్ దేశాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించాయి. బయట ప్రపంచంతో పై దేశాలు అన్నీ రకాల రాకపోకలను నిషేధించాయి.
పై దేశాల్లో అంతర్గత పరిస్ధితులను బట్టి కొన్ని దేశాలు రెండు వారాలు లాక్ డౌన్ అంటే మరికొన్ని దేశాలు నెల రోజుల వరకు లాక్ డౌన్ అన్నాయి. పైన చెప్పిన కొన్ని దేశాల్లో కరోనా వైరస్ సెకండ్ వేవ్, మరికొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా మొదలైనట్లు ప్రభుత్వాలు ఆందోళన పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోతోంది.
యావత్ ప్రపంచం సుమారు 8 నెలల పాటు వైరస్ దెబ్బకు తల్లక్రిందులైనపోయిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్ధిక వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. ఇటలీ, న్యూజిల్యాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో అయితే ఏకంగా ప్రభుత్వాలే తల్లకిందులైపోయాయి. ప్రపంచం మొత్తం మీద సుమారు 15 కోట్లమంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు.
ఒకవైపు కరోనా వైరస్ కు విరుగుడుగా యాంటీ వ్యాక్సిన్ తయారైనా వైరస్ బాధితులు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నారు. కరోనా కూడా ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోంది. కరోనా టీకాలు వేసుకున్న వారిలో కూడా మళ్ళీ వైరస్ సోకుతోంది. అలాగే టీకాలు వేసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు. టీకాలు వేసుకున్న వారికి కరోనా వైరస్ సోకటానికి, చనిపోవటంపై వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. మొత్తం మీద మళ్ళీ లాక్ డౌన్ పెరిగిపోతుండటం ఆందోళనకరమనే చెప్పాలి.
This post was last modified on March 19, 2021 10:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…