కోటి కాదు రెండు కోట్లు కాదు. ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి సంచలనంగా మారారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళం ఇవ్వటమే కాదు.. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తన వంతుగా చేసిన సాయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ రూ.300కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిందెవరంటే.. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (చిన్నగా చెప్పుకోవాలంటే యూఐసీ) సంస్థ.
తాజాగా ఈ సంస్థ అధినేత సంజయ్ సింగ్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. రూ.300 కోట్ల విరాళాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన యూఐసీ అధినేత.. తిరుపతిలో చిన్న పిల్లల ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. విభజన వేళ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి.. విజయవాడ.. విశాఖ పట్నాల్లో ఆసుపత్రులు కట్టాలన్న ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని.. తాజాగా యూఐసీ సంస్థ ముందుకొచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తొలి ఆసుపత్రిని శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్మిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోవటం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఈ పిల్లల ఆసుపత్రి ఉండనుంది.
This post was last modified on March 13, 2021 4:36 pm
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…
కలర్ ఫోటోతో పెద్ద గుర్తింపు తెచ్చుకుని రైటర్ పద్మభూషణ్ రూపంలో మొదటి థియేట్రికల్ హిట్ అందుకున్న సుహాస్ కు ఈ…
మే మొదటి వారం కొత్త రిలీజులు నిరాశపరిచిన నేపథ్యంలో అందరి కళ్ళు రాబోయే శుక్రవారం మీద ఉన్నాయి. స్టార్ హీరోలవి…
ఆంధ్రప్రదేశ్లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు…