Trends

పిల్లల ఆసుపత్రికి రూ.300 కోట్లు ఇచ్చిన పెద్ద మనిషి

కోటి కాదు రెండు కోట్లు కాదు. ఏకంగా రూ.300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి సంచలనంగా మారారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ మొత్తంలో విరాళం ఇవ్వటమే కాదు.. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తన వంతుగా చేసిన సాయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ రూ.300కోట్ల భారీ విరాళాన్ని ఇచ్చిందెవరంటే.. ముంబయికి చెందిన ఉద్వేగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ (చిన్నగా చెప్పుకోవాలంటే యూఐసీ) సంస్థ.

తాజాగా ఈ సంస్థ అధినేత సంజయ్ సింగ్ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. రూ.300 కోట్ల విరాళాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన యూఐసీ అధినేత.. తిరుపతిలో చిన్న పిల్లల ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకొచ్చారు. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాల్ని మార్చుకున్నారు. విభజన వేళ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు ఉన్నత వైద్య సేవలు అందించేందుకు తిరుపతి.. విజయవాడ.. విశాఖ పట్నాల్లో ఆసుపత్రులు కట్టాలన్న ఆలోచన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందని.. తాజాగా యూఐసీ సంస్థ ముందుకొచ్చిందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తొలి ఆసుపత్రిని శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్మిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆసుపత్రిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకోవటం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి అనుబంధంగా ఈ పిల్లల ఆసుపత్రి ఉండనుంది.

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

41 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago