నిజంగా నిజం. ఇవాల్టి రోజున ఒకరిని నమ్మలేని పరిస్థితి. బంధాలన్ని ఆర్థికమేనని ఓ పెద్ద మనిషి అప్పుడెప్పుడో చెప్పారు కానీ.. ఈ ఆర్థికం కోసం ఎంతకైనా తెగించే ధోరణి ఇటీవల అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీంతో ఊహించని దరిద్రపుగొట్టు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఒక ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం తర్వాత.. కొత్తవారు పిలిచిన వెంటనే వెళ్లటం ఎంత ప్రమాదకరమన్న విషయం అర్థం కాక మానదు.
ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకలోని హోస్పేట్ లో ఒక వ్యాపారవేత్త ఉన్నారు. ఆయనకు కొప్పళ్ లో స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. దీనికి సంబంధించి ఆఫీస్ హోస్పేటలోని ఎంజే నగర్ లో ఏర్పాటు చేశారు. ఆ ఆఫీసు ఎదురుగా ఉండే ఇంట్లో గీత అనే మహిళ ఉంటున్నారు.
2019లో సదరు వ్యాపారవేత్తకు.. ఎదురింట్లోఉండే గీత పరిచయమయ్యారు. అలా పెరిగిన వారి స్నేహం.. తర్వాత ఆయన్ను ఒక రోజు టీ కి రావాలని ఇంటికి ఆహ్వానించింది గీత. దీంతో వారింటికి వెళ్లిన ఆయన టీ తాగారు. కాసేపటికి ఆయన మూర్ఛబోయాడు. గంట తర్వాత తేరుకొని ఇంటికి వెళ్లారు.
రెండు రోజుల తర్వాత ఫోన్ చేసిన గీత.. ‘మీ నగ్నవీడియోలు నా దగ్గరఉన్నాయి. రూ.30లక్షలు ఇచ్చి సీడీలు తీసుకెళ్లండి’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీంతో.. ఆయనకు బొమ్మ తిరిగింది. టీకి పిలిచి.. తనకేదో చేశారన్న విషయాన్ని అర్థం చేసుకున్న ఆయన.. చేసేదేమీ లేక గీత బ్యాంకు ఖాతాకు రూ.15 లక్షలు బదిలీ చేశారు. మిగిలిన రూ.15 లక్షల కోసం గీత తీవ్రంగా ఒత్తిడి చేసింది.
దీంతో.. ఆమె వేధింపులకు తట్టుకోలేని ఆ స్టీల్ కంపెనీ యజమాని.. పోలీసుల్ని ఆశ్రయించి జరిగిందంతా చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గీత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా2750 గ్రాముల గంజాయి లభించింది. గీతతో పాటు.. ఆమెకు సహకారం అందించే ఆమె కొడుకు విష్ణును అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపర్చారు. ఇప్పుడు అర్థమైందా? ఎదురింటి ఆంటీ టీకి పిలిచారనో.. మరొక దానికి రమ్మన్నారని వెనుకా ముందు చూసుకోకుండా వెళితే.. అడ్డంగా బుక్ అయ్యే అవకాశాలే ఎక్కువ. బీకేర్ ఫుల్.
This post was last modified on March 9, 2021 10:59 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…