హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పని కోసం తీసుకొచ్చిన పని మనిషిపై.. సదరు యజమాని ఫ్లాట్ లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు రెండు వారాలకు కానీ ఫలించలేదు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉదయ భాను అనే యాభైరెండేళ్ల వ్యాపారి ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు..గత నెల 17న రాజమండ్రి నుంచి ఒక పని మనిషిని రప్పించుకున్నాడు. అపార్ట్ మెంట్ లోనే ఒక గదిని కేటాయించి ఆమె ఉండేందుకు చోటు కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఊరు నుంచి వచ్చిన పక్క రోజున ఆమె పని చేస్తుంటే.. బలవంతంగా తన రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడ్డాడు.
ఈ విషయం బయటకు వస్తే.. నిన్ను.. నీ కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. అదే సమయంలో ఆమె దగ్గర సెల్ ఫోన్ ను లాక్కొని తన వద్దే పెట్టుకున్నాడు. అది మొదలు.. ఆమెను బెదిరిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా.. గది బయట తాళం వేసి వెళ్లిపోతున్నాడు. తనపై జరుగుతున్న దాడి గురించి కుమార్తెకు చెప్పుకునే వీలు లేకపోయింది. ఈ నెల 5న సదరు నిందితుడు బయటకు వెళుతున్న సమయంలో ఆమె తన సెల్ ఫోన్ ను తీసుకొని.. జరిగిన విషయాన్ని కుమార్తెకు చెప్పింది.
వెంటనే స్పందించిన కుమార్తె.. డయల్ 100కు ఫోన్ చేసి తన తల్లికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పింది. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.. ఆమెను బంధించిన లొకేషన్ ను గుర్తించారు. సిబ్బందితో కలిసిన బంజారాహిల్స్ పోలీసుల టీం అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి.. బాధితురాలికి విముక్తి కల్పించారు. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 7, 2021 2:53 pm
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…