హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పని కోసం తీసుకొచ్చిన పని మనిషిపై.. సదరు యజమాని ఫ్లాట్ లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు రెండు వారాలకు కానీ ఫలించలేదు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉదయ భాను అనే యాభైరెండేళ్ల వ్యాపారి ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు..గత నెల 17న రాజమండ్రి నుంచి ఒక పని మనిషిని రప్పించుకున్నాడు. అపార్ట్ మెంట్ లోనే ఒక గదిని కేటాయించి ఆమె ఉండేందుకు చోటు కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఊరు నుంచి వచ్చిన పక్క రోజున ఆమె పని చేస్తుంటే.. బలవంతంగా తన రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడ్డాడు.
ఈ విషయం బయటకు వస్తే.. నిన్ను.. నీ కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. అదే సమయంలో ఆమె దగ్గర సెల్ ఫోన్ ను లాక్కొని తన వద్దే పెట్టుకున్నాడు. అది మొదలు.. ఆమెను బెదిరిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా.. గది బయట తాళం వేసి వెళ్లిపోతున్నాడు. తనపై జరుగుతున్న దాడి గురించి కుమార్తెకు చెప్పుకునే వీలు లేకపోయింది. ఈ నెల 5న సదరు నిందితుడు బయటకు వెళుతున్న సమయంలో ఆమె తన సెల్ ఫోన్ ను తీసుకొని.. జరిగిన విషయాన్ని కుమార్తెకు చెప్పింది.
వెంటనే స్పందించిన కుమార్తె.. డయల్ 100కు ఫోన్ చేసి తన తల్లికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పింది. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.. ఆమెను బంధించిన లొకేషన్ ను గుర్తించారు. సిబ్బందితో కలిసిన బంజారాహిల్స్ పోలీసుల టీం అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి.. బాధితురాలికి విముక్తి కల్పించారు. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 7, 2021 2:53 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…