హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఇంట్లో పని కోసం తీసుకొచ్చిన పని మనిషిపై.. సదరు యజమాని ఫ్లాట్ లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు రెండు వారాలకు కానీ ఫలించలేదు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిలింనగర్ లో ఒక అపార్ట్ మెంట్ లో ఉదయ భాను అనే యాభైరెండేళ్ల వ్యాపారి ఉంటున్నాడు. సినీ పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు..గత నెల 17న రాజమండ్రి నుంచి ఒక పని మనిషిని రప్పించుకున్నాడు. అపార్ట్ మెంట్ లోనే ఒక గదిని కేటాయించి ఆమె ఉండేందుకు చోటు కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఊరు నుంచి వచ్చిన పక్క రోజున ఆమె పని చేస్తుంటే.. బలవంతంగా తన రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడ్డాడు.
ఈ విషయం బయటకు వస్తే.. నిన్ను.. నీ కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. అదే సమయంలో ఆమె దగ్గర సెల్ ఫోన్ ను లాక్కొని తన వద్దే పెట్టుకున్నాడు. అది మొదలు.. ఆమెను బెదిరిస్తూ.. లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా.. గది బయట తాళం వేసి వెళ్లిపోతున్నాడు. తనపై జరుగుతున్న దాడి గురించి కుమార్తెకు చెప్పుకునే వీలు లేకపోయింది. ఈ నెల 5న సదరు నిందితుడు బయటకు వెళుతున్న సమయంలో ఆమె తన సెల్ ఫోన్ ను తీసుకొని.. జరిగిన విషయాన్ని కుమార్తెకు చెప్పింది.
వెంటనే స్పందించిన కుమార్తె.. డయల్ 100కు ఫోన్ చేసి తన తల్లికి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి గురించి చెప్పింది. దీంతో.. స్పందించిన పోలీసులు వెంటనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా.. ఆమెను బంధించిన లొకేషన్ ను గుర్తించారు. సిబ్బందితో కలిసిన బంజారాహిల్స్ పోలీసుల టీం అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించి.. బాధితురాలికి విముక్తి కల్పించారు. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on March 7, 2021 2:53 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…