Trends

భార్యను చంపేసి.. డయల్ 100కు ఫోన్.. పోలీసుల కోసం వెయిట్ చేశాడు

భార్యల్ని భర్తలు.. భర్తల్ని భార్యల్ని చంపేయటం ఈ మధ్యన ఎక్కువైంది. జీవితాంతం తోడు ఉంటామన్న బాసలు ఇప్పుడు ఎవరూ పట్టించుకోని పరిస్థితి. క్షణిక ఆవేశం.. అంతకు మించిన అనుమానం పెనుభూతంలా మారుతోంది. కాపురాల్ని కాటికి తీసుకెళుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం ఈ కోవకు చెందినిదే. ఆరోగ్యం సరిగా లేని భార్యను ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లుగా చెప్పి.. దారి మధ్యలో దారుణంగా చంపేసి.. డయల్ 100కు ఫోన్ చేసి మరీ తాను చేసిన ఆరాచకాన్ని చెప్పి లొంగిపోవటం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లాలోని పెనుగొండకు చెందిన నరేశ్ కు చిన్నగూడురు మండలంలోని బయ్యారానికి చెందిన సరితతో పన్నెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నరేశ్ డీసీఎం డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి సరిత రెండో భార్య. ఇటీవల ఆమెపై అనుమానాన్ని పెంచుకున్నాడు. దీంతో.. తరచూ వారిద్దరి మధ్య గొడవలు అయ్యేవి. ఇదిలా ఉండగా.. ఇలాంటి చెత్త అనుమానాన్ని పెట్టుకొని ఆమెను చితకబాదేశాడు. దీంతో.. సరిత తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలిసిన సరిత తల్లి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లింది.

ఈ క్రమంలో సోమవారం అత్తారింటికి వెళ్లిన నరేశ్.. వారికి సర్దిచెప్పి.. మంచి ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లుగా చెప్పి.. ఆమెను.. చిన్న కమార్తెను వెంట పెట్టుకొని బయలుదేశాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం నామాలపాడు అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు. తనతో తెచ్చుకున్న కత్తితో సరితను పొడిచేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. ఆపై డయల్ 100కు ఫోన్ చేసి భార్యను హత్య చేసినట్లుగా సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వచ్చే లోపు అక్కడి స్థానికులు వచ్చారు. ఏం జరిగిందన్న వారి ప్రశ్నకు నరేశ్ బదులిస్తూ.. తన భార్యను తాను చంపేసానని.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పానని.. వారొచ్చే వరకు తాను అక్కడే ఉంటానని చెప్పిన వైనం విస్మయానికి గురి చేసింది. తన భార్య చచ్చిపోయిందని.. ఇక తాను దేనికైనా సిద్ధమేనని.. ఉరి వేసినా అనుభవిస్తానని చెబుతున్న తీరు చూస్తే. అతగాడి ఉన్మాదం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని చెప్పక తప్పదు.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

4 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

6 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago