మిస్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేంలోని పలువురు మాజీ మిస్ ఇండియాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీలు ఒక వెలుగు వెలిగారు. అందుకే, మోడలింగ్ లోకి అడుగుపెట్టిన యువతులంతా మిస్ ఇండియా కావాలని కలలు కంటుంటారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి.
అ అందం…అదృష్టం రెండూ మెండుగా ఉన్న మన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మిస్ ఇండియా కలను సాకారం చేసుకుంది. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన పోటీల్లో మానస వారణాసి విజేతగా నిలిచింది.
ఈ పోటీల్లో హరియాణా అమ్మాయి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించిన ఈ పోటీల మొదటి రౌండ్కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.
వీఎల్సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ స్పాన్సర్ చేశాయి. ఈ పోటీల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. మన తెలుగమ్మాయి మానస ఇదే ఊపును కొనసాగిస్తూ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ప్రపంచ వాణిజ్య నౌకారవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసి వేస్తున్నట్టు…