మిస్ ఇండియా పోటీలకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. మనదేంలోని పలువురు మాజీ మిస్ ఇండియాలు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీలు ఒక వెలుగు వెలిగారు. అందుకే, మోడలింగ్ లోకి అడుగుపెట్టిన యువతులంతా మిస్ ఇండియా కావాలని కలలు కంటుంటారు. అయితే, ఆ కల సాకారం చేసుకోవాలంటే అందంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి.
అ అందం…అదృష్టం రెండూ మెండుగా ఉన్న మన తెలంగాణ అమ్మాయి మానస వారణాసి మిస్ ఇండియా కలను సాకారం చేసుకుంది. వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించింది. బుధవారం రాత్రి ముంబైలో జరిగిన పోటీల్లో మానస వారణాసి విజేతగా నిలిచింది.
ఈ పోటీల్లో హరియాణా అమ్మాయి మానిక శికంద్ ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన మాన్యసింగ్ ఫెమినా మిస్ ఇండియా 2020 రన్నరప్గా నిలిచారు. జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్, ప్రముఖ డిజైనర్ ఫల్గుణి వ్యవహరించిన ఈ పోటీల మొదటి రౌండ్కు మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు.
వీఎల్సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ స్పాన్సర్ చేశాయి. ఈ పోటీల గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఫిబ్రవరి 28న ప్రముఖ హిందీ ఛానల్ కలర్స్ టీవీలో ప్రసారం కానుంది. మన తెలుగమ్మాయి మానస ఇదే ఊపును కొనసాగిస్తూ మిస్ వరల్డ్ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆల్ ది బెస్ట్ చెబుదాం.
This post was last modified on February 11, 2021 12:23 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…