ఈ మధ్య రైతు ఉద్యమం మీద భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానె తదితరులు చేసిన ట్వీట్లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. క్రికెటర్లు ఈ అంశం మీద స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. రైతు ఉద్యమాన్ని ఉపయోగించుకుని దేశంలో అస్థిరత కోసం విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వీరంతా స్పందించారు.
ఐతే ఉద్యమాన్ని అణగదొక్కేందుకు మోడీ సర్కారే ఈ అంశాన్ని పక్కదోవ పట్టిస్తోందన్న ఆరోపణలూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సచిన్, కోహ్లి, రహానె తదితరులు ట్వీట్లు వేశారు. అవి ప్రభుత్వానికి మద్దతుగా, రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా వేసిన ట్వీట్లలాగే ప్రచారం పొందాయి. వీరిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు. ముఖ్యంగా సచిన్ను ఓ వర్గం గట్టిగా టార్గెట్ చేసుకుంది. అతను అధికారంలో ఎవరుంటే వాళ్లకు సపోర్ట్ ఇస్తాడని, కార్పొరేట్ శక్తుల కోసం పని చేస్తాడని విమర్శలు గుప్పించారు నెటిజన్లు. అతణ్ని దారుణంగా ట్రోల్ చేశారు.
కాగా ఇప్పుడీ విషయమై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ఆసక్తికర స్పందించాడు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడే బోళా మనిషిగా కపిల్కు పేరుంది. రైతు ఉద్యమానికి సంబంధించి సచిన్, కోహ్లి తదితరులు చేసిన ట్వీట్లను కపిల్ తప్పుబట్టాడు. కాకపోతే అది వాళ్లు బలవంతం మీద చేశారని ఆయన అభిప్రాయపడ్డాడు. దీని వెనుక ఉన్నది కేంద్ర హోం మంత్రి తనయుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా అని ఆయన ఆరోపించాడు.
ప్రభుత్వానికి మద్దతుగా క్రికెటర్లను అతనే రంగంలోకి దించాడని ఆరోపించాడు. అతడి బలవంతం మీద, తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్లు ట్వీట్ చేశారని కపిల్ అన్నాడు. క్రికెటర్లను ఇలా తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దారుణమని.. క్రికెటర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలని కపిల్ అన్నాడు. క్రికెటర్లతో ఇలాంటి ఆటలు ఆడొద్దని ఆయన కఠువుగానే మాట్లాడారు. ఐతే కపిల్కు వ్యతిరేకంగా వెంటనే కొందరు విమర్శలు మొదలుపెట్టేశారు. ఆయన్ని మరింతగా టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 9, 2021 2:13 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…