మైనర్ తో నడిపిన ప్రేమ, చేసుకున్న పెళ్ళి వికటించటంతో చివరకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. చెన్నైలోని కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత తన మకాంను విశాఖపట్నంకు మార్చాడు. వైజాగ్ లోని ఓ హోటల్లో పనిచేస్తుండగానే తాడిచెట్లపాలెంకు చెందిన ఓ మైనర్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
కొంతకాలం వాళ్ళ ప్రేమాయణం బాగానే నడిచిన తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. కూతురు వివాహం విషయం తెలియటంతో ఆ అమ్మాయి తల్లి, దండ్రులు వాళ్ళిద్దరినీ విడదీశారు. ఇందులో భాగంగానే కూతురును విజయవాడలోని ఓ హాస్టల్లో చదువునిమ్మతం చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలాజీ కూడా వైజాగ్ ఉద్యోగం వదులుకుని తాను కూడా విజయవాడ చేరుకున్నాడు.
విజయవాడలో ఇద్దరు తరచు కలుసుకునే వారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే గొడవలు మొదలయ్యాయో అప్పటి నుండి ఆ అమ్మాయి బాలీజీని దూరం పెట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఆ అమ్మాయికి మరో యువకుడితో పరిచయం ఏర్పడటం అదికాస్త చివరకు ప్రేమగా మారి చివరకు పెళ్ళి చేసుకున్నారు.
మొదటి తనను వివాహం చేసుకుని మళ్ళీ ఇంకో యువకుడిని పెళ్ళి చేసుకున్నదని తెలుసుకున్న బాలాజీ అమ్మాయిని వేధించటం మొదలుపెట్టాడు. చివరకు వేధింపులు ఎక్కువైపోవటంతో వ్యవహారం పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది. పోలీసులు అందరినీ పిలిపించి బాలాజీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే దీన్ని అవమానంగా భావించిన బాలాజీ చివరకు ఆత్మహత్యకు చేసుకున్నాడు. మొత్తానికి మైనర్ యువతితో నెరిపిన ప్రేమ, పెళ్ళి చివరకు యువకుడినే బలితీసుకుంది.
This post was last modified on February 8, 2021 11:11 am
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…