Trends

ప్రాణాలు తీసిన మైనర్ తో ప్రేమ, పెళ్ళి

మైనర్ తో నడిపిన ప్రేమ, చేసుకున్న పెళ్ళి వికటించటంతో చివరకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఏమిటంటే చిత్తూరు జిల్లాకు చెందిన బాలాజీ అనే యువకుడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. చెన్నైలోని కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత తన మకాంను విశాఖపట్నంకు మార్చాడు. వైజాగ్ లోని ఓ హోటల్లో పనిచేస్తుండగానే తాడిచెట్లపాలెంకు చెందిన ఓ మైనర్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

కొంతకాలం వాళ్ళ ప్రేమాయణం బాగానే నడిచిన తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. కూతురు వివాహం విషయం తెలియటంతో ఆ అమ్మాయి తల్లి, దండ్రులు వాళ్ళిద్దరినీ విడదీశారు. ఇందులో భాగంగానే కూతురును విజయవాడలోని ఓ హాస్టల్లో చదువునిమ్మతం చేర్పించారు. విషయం తెలుసుకున్న బాలాజీ కూడా వైజాగ్ ఉద్యోగం వదులుకుని తాను కూడా విజయవాడ చేరుకున్నాడు.

విజయవాడలో ఇద్దరు తరచు కలుసుకునే వారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే గొడవలు మొదలయ్యాయో అప్పటి నుండి ఆ అమ్మాయి బాలీజీని దూరం పెట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఆ అమ్మాయికి మరో యువకుడితో పరిచయం ఏర్పడటం అదికాస్త చివరకు ప్రేమగా మారి చివరకు పెళ్ళి చేసుకున్నారు.

మొదటి తనను వివాహం చేసుకుని మళ్ళీ ఇంకో యువకుడిని పెళ్ళి చేసుకున్నదని తెలుసుకున్న బాలాజీ అమ్మాయిని వేధించటం మొదలుపెట్టాడు. చివరకు వేధింపులు ఎక్కువైపోవటంతో వ్యవహారం పోలీసుస్టేషన్ దాకా వెళ్ళింది. పోలీసులు అందరినీ పిలిపించి బాలాజీకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే దీన్ని అవమానంగా భావించిన బాలాజీ చివరకు ఆత్మహత్యకు చేసుకున్నాడు. మొత్తానికి మైనర్ యువతితో నెరిపిన ప్రేమ, పెళ్ళి చివరకు యువకుడినే బలితీసుకుంది.

This post was last modified on February 8, 2021 11:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

33 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago