మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది.
ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే పోలీసు ఎస్సై శిరీష తన సిబ్బందితో వచ్చారు. విచారణ చేసిన తర్వాత మృతుడు అనాదగా తేల్చారు. దాంతో చేయాల్సిన పనిపై అందరితోను చర్చించారు. అయితే ఏమి చేయాలనే విషయమై స్ధానికుల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు.
దాంతో చివరకు ఎస్సై శిరీషే పూనుకున్నారు. ఒకరిని తోడు తీసుకుని అనాద శవాన్ని మోయటానికి స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. పొలం నుండి మృతదేహాన్ని స్ట్రెచర్ పై ఎస్సై స్వయంగా 2 కిలోమీటర్ల మోసుకుంటూ వచ్చారు. 2 కిలోమీటర్లు అనాద శవాన్ని మోసుకురావటమే కాకుండా అంత్యక్రియలు కూడా దగ్గరుండి ఆమే జరిపించారు. ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.
ఎప్పుడైతే ఘటన మొత్తం సోషల్ మీడియాలో కనబడిందో వెంటనే అది వైరల్ గా మారింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు చేరింది. ఘటన మొత్తాన్ని చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్సైని అభినందిస్తు ట్వీట్ చేశారు.
This post was last modified on February 1, 2021 4:45 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…