మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది.
ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే పోలీసు ఎస్సై శిరీష తన సిబ్బందితో వచ్చారు. విచారణ చేసిన తర్వాత మృతుడు అనాదగా తేల్చారు. దాంతో చేయాల్సిన పనిపై అందరితోను చర్చించారు. అయితే ఏమి చేయాలనే విషయమై స్ధానికుల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు.
దాంతో చివరకు ఎస్సై శిరీషే పూనుకున్నారు. ఒకరిని తోడు తీసుకుని అనాద శవాన్ని మోయటానికి స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. పొలం నుండి మృతదేహాన్ని స్ట్రెచర్ పై ఎస్సై స్వయంగా 2 కిలోమీటర్ల మోసుకుంటూ వచ్చారు. 2 కిలోమీటర్లు అనాద శవాన్ని మోసుకురావటమే కాకుండా అంత్యక్రియలు కూడా దగ్గరుండి ఆమే జరిపించారు. ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.
ఎప్పుడైతే ఘటన మొత్తం సోషల్ మీడియాలో కనబడిందో వెంటనే అది వైరల్ గా మారింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు చేరింది. ఘటన మొత్తాన్ని చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్సైని అభినందిస్తు ట్వీట్ చేశారు.
This post was last modified on February 1, 2021 4:45 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్…
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల…
నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తండేల్ రాజ్ ని పుష్పరాజ్ కలుసుకోవడాన్ని చూసి ఆనందిద్దామని ఎదురు చూసిన…
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు…
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి…
పియర్ పండు, లేదా బేరిపండు, రుచిలో మధురమైనది మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ పండు…