Trends

మహిళా ఎస్సై చేసిన పనికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు

మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది.

ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే పోలీసు ఎస్సై శిరీష తన సిబ్బందితో వచ్చారు. విచారణ చేసిన తర్వాత మృతుడు అనాదగా తేల్చారు. దాంతో చేయాల్సిన పనిపై అందరితోను చర్చించారు. అయితే ఏమి చేయాలనే విషయమై స్ధానికుల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు.

దాంతో చివరకు ఎస్సై శిరీషే పూనుకున్నారు. ఒకరిని తోడు తీసుకుని అనాద శవాన్ని మోయటానికి స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. పొలం నుండి మృతదేహాన్ని స్ట్రెచర్ పై ఎస్సై స్వయంగా 2 కిలోమీటర్ల మోసుకుంటూ వచ్చారు. 2 కిలోమీటర్లు అనాద శవాన్ని మోసుకురావటమే కాకుండా అంత్యక్రియలు కూడా దగ్గరుండి ఆమే జరిపించారు. ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.

ఎప్పుడైతే ఘటన మొత్తం సోషల్ మీడియాలో కనబడిందో వెంటనే అది వైరల్ గా మారింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు చేరింది. ఘటన మొత్తాన్ని చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్సైని అభినందిస్తు ట్వీట్ చేశారు.

This post was last modified on February 1, 2021 4:45 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

43 mins ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

47 mins ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

2 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

3 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

4 hours ago

దొరలను దోచుకునే ‘వీరమల్లు’ ఆగమనం

పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న హరిహర వీరమల్లు రెండు…

4 hours ago