మామూలుగా పోలీసులంటే జనాలందరికీ ఓ నెగిటివ్ అభిప్రాయముంది. దానికి కారణాలు బోలెడుంటాయి. అయితే అక్కడక్కడ పోలీసుల్లోనే తాము భిన్నమని కొందరు నిరూపించుకుంటుంటారు. అలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని అడవి కొత్తూరు ప్రాంతంలో జరిగింది. ఇంతకీ విషయం ఏమిటంటే జిల్లాలోని కాశీబుగ్గ మున్సిపాలిటి ప్రాంతంలోని అడవికొత్తూరు గ్రామం ఉంది.
ఈ గ్రామపరిధిలోని పంట పొలాల్లో గుర్తతెలీని మృతదేహాన్ని స్ధానికులు గుర్తించారు. ఇదే విషయాన్ని స్ధానికులు పోలీసులకు తెలియజేశారు. దాంతో వెంటనే పోలీసు ఎస్సై శిరీష తన సిబ్బందితో వచ్చారు. విచారణ చేసిన తర్వాత మృతుడు అనాదగా తేల్చారు. దాంతో చేయాల్సిన పనిపై అందరితోను చర్చించారు. అయితే ఏమి చేయాలనే విషయమై స్ధానికుల్లో పెద్దగా సానుకూలత కనబడలేదు.
దాంతో చివరకు ఎస్సై శిరీషే పూనుకున్నారు. ఒకరిని తోడు తీసుకుని అనాద శవాన్ని మోయటానికి స్ట్రెచర్ లాంటిదాన్ని ఏర్పాటు చేశారు. పొలం నుండి మృతదేహాన్ని స్ట్రెచర్ పై ఎస్సై స్వయంగా 2 కిలోమీటర్ల మోసుకుంటూ వచ్చారు. 2 కిలోమీటర్లు అనాద శవాన్ని మోసుకురావటమే కాకుండా అంత్యక్రియలు కూడా దగ్గరుండి ఆమే జరిపించారు. ఈ ఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు.
ఎప్పుడైతే ఘటన మొత్తం సోషల్ మీడియాలో కనబడిందో వెంటనే అది వైరల్ గా మారింది. చివరకు అది పోలీసు ఉన్నతాధికారుల దగ్గరకు చేరింది. ఘటన మొత్తాన్ని చూసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎస్సైని అభినందిస్తు ట్వీట్ చేశారు.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…