కాళ్లకు స్పోర్ట్స్ షూస్ లేవు.. ఒంటిపై ఖరీదైన క్రీడా దుస్తులు లేవు.. సాధారణ చీర, చెప్పులతోనే బరిలోకి దిగారు. పరుగులో చెప్పులు పదేపదే జారిపోవడంతో వాటిని చేతిలో పట్టుకుని.. రాళ్లు తేలిన రహదారిపై పరుగెత్తారు. చివరకు ట్రాక్సూట్లు, స్పోర్ట్స్ షూస్తో వచ్చిన యువతులను వెనక్కినెట్టి మారథాన్లో తొలి స్థానంలో నిలిచారు 47 ఏళ్ల రమాబాయి రణ్వీర్. ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం ఆమె సాగించిన ఈ పరుగు ఇప్పుడు స్ఫూర్తిగా నిలుస్తోంది.
బీడ్ జిల్లా అంబాజోగైలోని ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రొపగేటర్ సంస్థకు చెందిన ఖోలేశ్వర్ ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ అమృత్ మహోత్సవం సందర్భంగా ‘అమృత్ రన్’ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుంచి భాగ్యనగర్ చౌక్ వరకు జరిగిన ఈ పోటీలో రమాబాయి పాల్గొన్నారు.
పరుగు ప్రారంభమైన కొద్దిసేపటికే రమాబాయి ధరించిన సాధారణ చెప్పులు జారిపడటం మొదలయ్యాయి. దీంతో వాటిని చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండానే పరుగును కొనసాగించారు. ఇటీవల కురిసిన వర్షాలతో చల్లగా మారిన, రాళ్లు తేలిన రహదారిపై కాళ్లకు నొప్పి వస్తున్నా వెనక్కి తగ్గలేదు. చీరను సర్దుకుంటూనే వేగంగా పరుగెత్తారు. ఒక్కొక్కరిని అధిగమిస్తూ చివరకు మొదటగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
రమాబాయి విజయం చూసిన ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. పోటీలో తొలి స్థానానికి లభించే రూ.3 వేల నగదు బహుమతి కోసం ఆమె పాల్గొన్నా.. దాని వెనుక ఉన్న అసలు లక్ష్యం మాత్రం తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు.
కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయిన రమాబాయి.. హింగోలి నుంచి అంబాజోగైకి వచ్చి వంటమనిషిగా పనిచేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకుంటూనే కుమార్తెల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, సౌకర్యాల కొరత ఆమెను ఆపలేకపోయాయి.
This post was last modified on August 31, 2026 3:44 pm
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ఇరు పార్టీలకు…
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో కల్కి-2 ఒకటి. 2024లో విడుదలైన కల్కి మూవీ ఎంత పెద్ద…
ఏపీలోని మార్కాపురం జిల్లాలో సోమవారం సీఎం చంద్రబాబు.. నాలుగు జిల్లాల్లోని 30 మండలాలకు మేలు చేసే `పూల సుబ్బయ్య వెలిగొండ`…
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000…
జూన్ ముందు రెండు మూడు నెలలు సరైన సినిమాలు లేక, జనాలు థియేటర్ల వైపు చూడక ఎగ్జిబిటర్లు అల్లాడిపోయారు. మధ్యలో…
రాష్ట్రానికి గొడ్డలి పార్టీ గ్రహణం వీడిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 2019లో రాష్ట్రానికి గొడ్డలి పార్టీ గ్రహణం పట్టుకుందని.. అయితే,…