ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకున్నంత చెడ్డ పేరు ఇంకెవ్వరికీ ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. ప్రత్యర్థులను మాటలతో దూషించడం.. ఏదో ఒక వివాదంలో వేలు పెట్టడం.. గెలుపు కోసం వక్ర మార్గాలు ప్రయత్నించడం.. ఇలా మైదానంలో ఏం చేయకూడదో అన్నీ చేస్తుంటారు.
అప్పట్లో ఒక మ్యాచ్లో చివరి బంతికి సిక్సర్ బాదితే అవతలి జట్టు గెలిచే స్థితిలో ఉంటే బౌలర్తో అండర్ ఆర్మ్ బౌలింగ్ చేయించి గెలిచిన చరిత్ర ఆస్ట్రేలియాది. ఇక కొన్నేళ్ల కిందటే బాల్ టాంపరింగ్ వివాదం ఆ జట్టును ఎంతగా అప్రతిష్ట పాలు చేసిందో తెలిసిందే.
ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారిగా ఉండి ఏడాది నిషేధం కూడా ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్.. ఆ ఉదంతం తర్వాత మారిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అతను ఒక నీచపు పని చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టులో భారత్ ముందు 407 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. ఓటమి తప్పించుకోవడం అసాధారణంగా కనిపిస్తున్న పరిస్థితుల్లో మూడో వికెట్ రూపంలో రహానె ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్. అతను అనూహ్యంగా చెలరేగి ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు చెమటలు పట్టించాడు. అతను 97 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఐతే పంత్ బ్యాటింగ్ చేస్తుండగా అతణ్ని దెబ్బ తీయడం కోసం స్మిత్ చేసిన పని స్టంప్ కెమెరాకు చిక్కింది. పంత్ డ్రింక్స్ తీసుకుంటున్నపుడు క్రీజు దగ్గరికి వచ్చిన స్మిత్.. అతడి గార్డ్ మార్క్స్ను షూలతో చెరిపేశాడు. తర్వాత పంత్ వచ్చి మళ్లీ గార్డ్ మార్క్స్ పెట్టుకోవాల్సి వచ్చింది.
స్టంప్ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యం కామెంటేటర్ల దృష్టిలో పడి స్మిత్ పై విమర్శలు గుప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్మిత్ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. షేమ్ ఆన్ యు స్మిత్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టి అతడి తీరును దుయ్యబడుతున్నారు.
This post was last modified on January 11, 2021 12:12 pm
జనవరిలో మూడు వందల కోట్ల వసూళ్లతో సునామిలా విరుచుకుపడి ఇండస్ట్రీ హిట్ సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సంచలనాలు ఇక్కడితో ఆగిపోవడం…
ఆగస్ట్ 14 మీద ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజీ మల్టీస్టారర్ వార్…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో ఇండస్ట్రీకి వచ్చిన రోషన్ డెబ్యూ చేశాక నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. 2021 తర్వాత…
వన్ మూవీ వండర్ లాగా ఎప్పుడో దశాబ్దం క్రితం బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ సాధించిన విజయ్ ఆంటోనీ పాతిక సినిమాలు…
ఒకప్పటి హీరో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీలో ఎంత ప్రతిభ ఉన్నా ఆ మధ్య రాజకీయాల వైపు వెళ్లిపోవడంతో ఇండస్ట్రీకి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఒక్కసారి మాటిచ్చారా? ఇక ఆ పని అయిపోయినట్టే. వాయిదా…