మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన (ఎఫ్డీఏ) సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయనాలతో సింథటిక్ పాలను తయారు చేసి మార్కెట్లో విక్రయించినట్లు గుర్తించారు. గత ఆరు నెలల్లో సుమారు 2.3 కోట్ల లీటర్ల కల్తీ పాలు వినియోగదారులకు చేరి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
దర్యాప్తులో నిందితుల విక్రయ రిజిస్టర్లను పరిశీలించగా, సుమారు 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 23,04,070 లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసినట్లు తేలింది. దీని విలువ సుమారు రూ.9.21 కోట్లుగా అంచనా వేశారు.
అధికారుల వివరాల ప్రకారం, ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్రయించినట్లు గుర్తించారు. ఈ లెక్కన భూమ్ ప్రాంతంలోని పాల సేకరణ కేంద్రాల నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు 2.3 కోట్ల లీటర్లకు పైగా కల్తీ పాలు సరఫరా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సింథటిక్ పాలు అసలైన పాలలా కనిపించేలా, కొవ్వు శాతం పెరిగినట్లు చూపించేందుకు డిటర్జెంట్ పొడి, పామ్ ఆయిల్, నాసిరకం రసాయన పొడులను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వ్యవహారంలో ఏడుగురిపై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసు నమోదై ఎనిమిది రోజులు గడిచినా నిందితులు పరారీలో ఉండటంతో, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
రోజూ పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా తీసుకునే పాలలోనే డిటర్జెంట్, రసాయనాలు కలపడం అత్యంత ప్రమాదకరం. వైద్యుల హెచ్చరికల ప్రకారం ఇలాంటి పాలను తరచూ తీసుకుంటే కాలేయం, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ తరహా కుంభకోణాలు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 14, 2026 11:39 pm
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…