భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఈసారి సిరీస్ ఏ గొడవా లేకుండా సాఫీగా సాగిపోతోందనుకుంటే.. మూడో టెస్టు కోసం జట్టుతో కలిసి సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ.. పృథ్వీ షా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, నవదీప్ సైని లాంటి కుర్రాళ్లను వెంటేసుకుని నిబంధనల్ని అతిక్రమించి ఓ రెస్టారెంట్లో భోజనం చేయడం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అయిదుగురిని జట్టుతో కాకుండా ఐసొలేషన్లో ఉండాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ఈ ఉదంతంపై బీసీసీఐతో కలిసి విచారణ జరుపుతామని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నెల 7న సిడ్నీలో ఆరంభమయ్యే మూడో టెస్టు వరకు రోహిత్ అండ్ కో జట్టుతో కలవరన్నట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు తెలిపాయి.
కానీ ఈ విషయంలో బీసీసీఐ తన పవర్ చూపించి.. ఒక్క రోజులో పరిస్థితులన్నీ మారిపోయేలా చేసింది. శనివారం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేరకు జట్టు నుంచి విడిగా ఐసొలేషన్లో ఉన్న ఆటగాళ్లు.. 24 గంటలు గడిచేసరికి మళ్లీ జట్టు దగ్గరికి వచ్చేసినట్లు తెలుస్తోంది. తమ ఆటగాళ్లు రెస్టారెంట్లో భోజనం చేయలేదని, ఫుడ్ తెచ్చుకోవడానికి మాత్రమే అక్కడికెళ్లారని బీసీసీఐ వాదిస్తోందట. కాబట్టి తమ వాళ్లకు ఐసొలేషన్ అవసరం లేదని తేల్చేసినట్లు తెలుస్తోంది. సోమవారం భారత జట్టు సిడ్నీకి బయల్దేరనుండగా.. జట్టుతో పాటే రోహిత్ అండ్ కో ఉండబోతోందట.
ఐతే నిబంధనల్ని అతిక్రమించి భారత జట్టు ఇలా వ్యవహరించడం, తమ మాటను పట్టించుకోకపోవడం క్రికెట్ ఆస్ట్రేలియాకు అస్సలు నచ్చట్లేదు. కానీ బీసీసీఐ పవర్ చూసి ఏమీ చేయలేకపోతోంది. మరోవైపు నాలుగో టెస్టు జరగనున్న బ్రిస్బేన్లో కరోనా, క్వారంటైన్ నిబంధనలు అత్యంత కఠినతరంగా ఉండటంతో.. ఆ మ్యాచ్ అక్కడ ఆడమని, సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వహించాలని భారత జట్టు పట్టుబడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు అంగీకరించని పక్షంలో సిరీస్ను బహిష్కరిస్తామని టీమ్ ఇండియా హెచ్చరించినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో సిరీస్ ఎక్కడ ప్రమాదంలో పడుతుందో అని ఆందోళన వ్యక్తమవుతోంది.
This post was last modified on January 4, 2021 7:13 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…