Trends

ప్ర‌మాదంలో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌?


భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఈసారి సిరీస్ ఏ గొడ‌వా లేకుండా సాఫీగా సాగిపోతోంద‌నుకుంటే.. మూడో టెస్టు కోసం జ‌ట్టుతో క‌లిసి సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. పృథ్వీ షా, శుభ్‌మ‌న్ గిల్, రిష‌బ్ పంత్, న‌వ‌దీప్ సైని లాంటి కుర్రాళ్ల‌ను వెంటేసుకుని నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి ఓ రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌డం దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అయిదుగురిని జ‌ట్టుతో కాకుండా ఐసొలేష‌న్లో ఉండాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఉదంతంపై బీసీసీఐతో క‌లిసి విచార‌ణ జ‌రుపుతామ‌ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నెల 7న సిడ్నీలో ఆరంభ‌మ‌య్యే మూడో టెస్టు వ‌ర‌కు రోహిత్ అండ్ కో జ‌ట్టుతో క‌ల‌వ‌ర‌న్న‌ట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి.

కానీ ఈ విష‌యంలో బీసీసీఐ త‌న ప‌వ‌ర్ చూపించి.. ఒక్క రోజులో ప‌రిస్థితుల‌న్నీ మారిపోయేలా చేసింది. శ‌నివారం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేర‌కు జ‌ట్టు నుంచి విడిగా ఐసొలేష‌న్లో ఉన్న ఆట‌గాళ్లు.. 24 గంట‌లు గ‌డిచేస‌రికి మ‌ళ్లీ జ‌ట్టు ద‌గ్గ‌రికి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ ఆట‌గాళ్లు రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌లేద‌ని, ఫుడ్ తెచ్చుకోవ‌డానికి మాత్ర‌మే అక్క‌డికెళ్లార‌ని బీసీసీఐ వాదిస్తోంద‌ట‌. కాబ‌ట్టి త‌మ వాళ్ల‌కు ఐసొలేష‌న్ అవ‌స‌రం లేద‌ని తేల్చేసిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం భార‌త జ‌ట్టు సిడ్నీకి బ‌య‌ల్దేర‌నుండ‌గా.. జ‌ట్టుతో పాటే రోహిత్ అండ్ కో ఉండ‌బోతోంద‌ట‌.

ఐతే నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి భార‌త జ‌ట్టు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం, త‌మ మాట‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం క్రికెట్ ఆస్ట్రేలియాకు అస్స‌లు న‌చ్చ‌ట్లేదు. కానీ బీసీసీఐ ప‌వ‌ర్ చూసి ఏమీ చేయ‌లేక‌పోతోంది. మ‌రోవైపు నాలుగో టెస్టు జ‌ర‌గ‌నున్న బ్రిస్బేన్‌లో క‌రోనా, క్వారంటైన్‌ నిబంధ‌న‌లు అత్యంత క‌ఠిన‌త‌రంగా ఉండ‌టంతో.. ఆ మ్యాచ్ అక్క‌డ ఆడ‌మ‌ని, సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వ‌హించాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందుకు అంగీక‌రించ‌ని ప‌క్షంలో సిరీస్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని టీమ్ ఇండియా హెచ్చ‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో సిరీస్ ఎక్క‌డ ప్ర‌మాదంలో ప‌డుతుందో అని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on January 4, 2021 7:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

యూత్ హీరోలు రూటు మారుస్తున్నారు

దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…

2 hours ago

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

5 hours ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

5 hours ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

6 hours ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

6 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

7 hours ago