Trends

ప్ర‌మాదంలో ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌?


భార‌త క్రికెట్ జ‌ట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిందంటే ఏదో ఒక వివాదం ఉండాల్సిందే. ఈసారి సిరీస్ ఏ గొడ‌వా లేకుండా సాఫీగా సాగిపోతోంద‌నుకుంటే.. మూడో టెస్టు కోసం జ‌ట్టుతో క‌లిసి సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌.. పృథ్వీ షా, శుభ్‌మ‌న్ గిల్, రిష‌బ్ పంత్, న‌వ‌దీప్ సైని లాంటి కుర్రాళ్ల‌ను వెంటేసుకుని నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి ఓ రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌డం దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై వెంట‌నే స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ అయిదుగురిని జ‌ట్టుతో కాకుండా ఐసొలేష‌న్లో ఉండాల‌ని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ ఉదంతంపై బీసీసీఐతో క‌లిసి విచార‌ణ జ‌రుపుతామ‌ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నెల 7న సిడ్నీలో ఆరంభ‌మ‌య్యే మూడో టెస్టు వ‌ర‌కు రోహిత్ అండ్ కో జ‌ట్టుతో క‌ల‌వ‌ర‌న్న‌ట్లుగా ఆస్ట్రేలియా క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి.

కానీ ఈ విష‌యంలో బీసీసీఐ త‌న ప‌వ‌ర్ చూపించి.. ఒక్క రోజులో ప‌రిస్థితుల‌న్నీ మారిపోయేలా చేసింది. శ‌నివారం క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశాల మేర‌కు జ‌ట్టు నుంచి విడిగా ఐసొలేష‌న్లో ఉన్న ఆట‌గాళ్లు.. 24 గంట‌లు గ‌డిచేస‌రికి మ‌ళ్లీ జ‌ట్టు ద‌గ్గ‌రికి వ‌చ్చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌మ ఆట‌గాళ్లు రెస్టారెంట్లో భోజ‌నం చేయ‌లేద‌ని, ఫుడ్ తెచ్చుకోవ‌డానికి మాత్ర‌మే అక్క‌డికెళ్లార‌ని బీసీసీఐ వాదిస్తోంద‌ట‌. కాబ‌ట్టి త‌మ వాళ్ల‌కు ఐసొలేష‌న్ అవ‌స‌రం లేద‌ని తేల్చేసిన‌ట్లు తెలుస్తోంది. సోమ‌వారం భార‌త జ‌ట్టు సిడ్నీకి బ‌య‌ల్దేర‌నుండ‌గా.. జ‌ట్టుతో పాటే రోహిత్ అండ్ కో ఉండ‌బోతోంద‌ట‌.

ఐతే నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించి భార‌త జ‌ట్టు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం, త‌మ మాట‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం క్రికెట్ ఆస్ట్రేలియాకు అస్స‌లు న‌చ్చ‌ట్లేదు. కానీ బీసీసీఐ ప‌వ‌ర్ చూసి ఏమీ చేయ‌లేక‌పోతోంది. మ‌రోవైపు నాలుగో టెస్టు జ‌ర‌గ‌నున్న బ్రిస్బేన్‌లో క‌రోనా, క్వారంటైన్‌ నిబంధ‌న‌లు అత్యంత క‌ఠిన‌త‌రంగా ఉండ‌టంతో.. ఆ మ్యాచ్ అక్క‌డ ఆడ‌మ‌ని, సిడ్నీలోనే నాలుగో టెస్టు కూడా నిర్వ‌హించాల‌ని భార‌త జ‌ట్టు ప‌ట్టుబ‌డుతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇందుకు అంగీక‌రించ‌ని ప‌క్షంలో సిరీస్‌ను బ‌హిష్క‌రిస్తామ‌ని టీమ్ ఇండియా హెచ్చ‌రించిన‌ట్లు వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో సిరీస్ ఎక్క‌డ ప్ర‌మాదంలో ప‌డుతుందో అని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on January 4, 2021 7:13 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

10 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

11 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

14 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

14 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

15 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

15 hours ago