భారత క్రికెట్ను గొప్ప మలుపు తిప్పి, టీమ్ ఇండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలబెట్టిన ఘనత సౌరభ్ గంగూలీదే. ఆటగాడిగా, కెప్టెన్గా గంగూలీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. అందుకే అతడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. ఆట నుంచి నిష్క్రమించాక క్రికెట్ పాలనలోకి అడుగు పెట్టిన గంగూలీ.. చాలా తక్కువ కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాడు.
అంతా బాగా సాగుతున్న సమయంలో గంగూలీ గుండెపోటుకు గురవడం అభిమానులకు పెద్ద షాక్. అదృష్టం కొద్దీ వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్త నాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నట్లు తేల్చడం.. కొన్ని గంటల తర్వాత యాంజియోప్లాస్టీ చేయడంతో గంగూలీకి పెద్ద ముప్పు తప్పినట్లయింది. పూడికలున్నచోట్ల స్టంట్లు వేయాల్సిన అవసరం రావచ్చని చెబుతున్నారు.
ఐతే ఆటలో ఉన్నపుడు, తర్వాత గంగూలీ ఎంతో ఫిట్గానే కనిపించాడు. 40వ ఏట వరకు క్రికెట్ ఆడిన సౌరభ్.. ఆ తర్వాత కూడా చాలా చురుగ్గానే కనిపిస్తున్నాడు. చాలామంది ఆట నుంచి వైదొలిగాక ఫిట్నెస్ గురించి పట్టించుకోరు. కానీ గంగూలీ అలా కాదు.. ఇప్పటికీ చాలా ఫిట్గా, హుషారుగా కనిపిస్తాడు. అతను మంచి లైఫ్ స్టైల్నే ఫాలో అవుతుంటాడు. మెంటల్గా కూడా గంగూలీ చాలా స్ట్రాంగ్. మరి ఇలాంటి వ్యక్తికి గుండెపోటు ఎందుకొచ్చిందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే దీనికి కారణంగా ఫ్యామిలీ హిస్టరీ అని తెలిసింది. గంగూలీ కుటుంబంలో ఇంతకుముందూ గుండె జబ్బు బాధితులున్నారట. అతడి సోదరుడు కూడా ఇంతకుముందు గుండెపోటుకు గురయ్యాడు. సౌరభ్ తండ్రి చండీదాస్ ఏడేళ్ల కిందట గుండెపోటుతోనే మరణించాడు. ఫ్యామిలీ హిస్టరీ ఇలా ఉన్న నేపథ్యంలోనే ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ సౌరభ్ గుండె పోటుకు గురయ్యాడన్నది స్పష్టం. కాబట్టి ఇకపై అతను జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on January 3, 2021 11:31 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…