భారత క్రికెట్ను గొప్ప మలుపు తిప్పి, టీమ్ ఇండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలబెట్టిన ఘనత సౌరభ్ గంగూలీదే. ఆటగాడిగా, కెప్టెన్గా గంగూలీ వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. అందుకే అతడిని కోట్లాది మంది ఆరాధిస్తారు. ఆట నుంచి నిష్క్రమించాక క్రికెట్ పాలనలోకి అడుగు పెట్టిన గంగూలీ.. చాలా తక్కువ కాలంలో ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. ఏకంగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టాడు.
అంతా బాగా సాగుతున్న సమయంలో గంగూలీ గుండెపోటుకు గురవడం అభిమానులకు పెద్ద షాక్. అదృష్టం కొద్దీ వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. గుండె రక్త నాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నట్లు తేల్చడం.. కొన్ని గంటల తర్వాత యాంజియోప్లాస్టీ చేయడంతో గంగూలీకి పెద్ద ముప్పు తప్పినట్లయింది. పూడికలున్నచోట్ల స్టంట్లు వేయాల్సిన అవసరం రావచ్చని చెబుతున్నారు.
ఐతే ఆటలో ఉన్నపుడు, తర్వాత గంగూలీ ఎంతో ఫిట్గానే కనిపించాడు. 40వ ఏట వరకు క్రికెట్ ఆడిన సౌరభ్.. ఆ తర్వాత కూడా చాలా చురుగ్గానే కనిపిస్తున్నాడు. చాలామంది ఆట నుంచి వైదొలిగాక ఫిట్నెస్ గురించి పట్టించుకోరు. కానీ గంగూలీ అలా కాదు.. ఇప్పటికీ చాలా ఫిట్గా, హుషారుగా కనిపిస్తాడు. అతను మంచి లైఫ్ స్టైల్నే ఫాలో అవుతుంటాడు. మెంటల్గా కూడా గంగూలీ చాలా స్ట్రాంగ్. మరి ఇలాంటి వ్యక్తికి గుండెపోటు ఎందుకొచ్చిందని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఐతే దీనికి కారణంగా ఫ్యామిలీ హిస్టరీ అని తెలిసింది. గంగూలీ కుటుంబంలో ఇంతకుముందూ గుండె జబ్బు బాధితులున్నారట. అతడి సోదరుడు కూడా ఇంతకుముందు గుండెపోటుకు గురయ్యాడు. సౌరభ్ తండ్రి చండీదాస్ ఏడేళ్ల కిందట గుండెపోటుతోనే మరణించాడు. ఫ్యామిలీ హిస్టరీ ఇలా ఉన్న నేపథ్యంలోనే ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ సౌరభ్ గుండె పోటుకు గురయ్యాడన్నది స్పష్టం. కాబట్టి ఇకపై అతను జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on January 3, 2021 11:31 am
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…