బుండి బుగ్యో-పేరు చిన్నదే అయినా.. ఏదో పెట్ నేమ్లా అనిపించినా.. ఇది పెద్ద ఎత్తున ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడేలా కూడా చేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అదే.. ఎబోలా వైరస్ వేరియెంట్ రూపమైన బుండి బ్యుగో. ప్రస్తుతం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది.
కరోనా టైపేనా?
అవును! బుండి బ్యుగో కరోనా వైరస్ టైపేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వ్యాప్తి, రోగనిరోధక శక్తి తగ్గుదల వంటి విషయంలో కరోనాతో సమానమేనని స్పష్టం చేసింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో అత్యంత పటిష్టమైన చర్యలు కూడా తీసుకున్నారు. రోగులను గుర్తించేందుకు ప్రపంచ స్థాయి వైద్యులను కూడా పంపించారు. ఈ వైరస్ సోకిన వారు.. 24 గంటల్లోనే మృతి చెందుతుండడం మరో విషాదం.
భారత్లో..
పశ్చిమాఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాలలో బుండి బుగ్యో వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలలోని ప్రయాణికులను నిశితంగా పరిశీలించాలని.. వారికి అవసరమైతే.. క్వారంటైన్ సదుపాయం కల్పించాలని కూడా సూచించింది. దగ్గుతుమ్ము.. కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వేరు చేసి.. తగిన వైద్య సేవలు అందించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అత్యవసర పరిస్థితిని విధించిన నేపథ్యంలో పశ్చిమాఫ్రికా దేశాలకు.. విమానాలను నడపడం ఆపేయాలని నిర్ణయించింది.
ఏంటి లక్షణాలు…
గత వారం వెలుగు చూసిన బుండి బుగ్యో వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు 88 మంది ప్రజలు మృతి చెందారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. దీనికి ప్రధానంగా దగ్గు, తుమ్ములు, కళ్లు ఎర్రబారడం.. జీర్ణక్రియలు మందగించడం.. జ్వరం వంటివి వస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ వేరియెంట్కు టీకాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలోనే పశ్చిమాఫ్రికా దేశాలకు అత్యవసర పరిస్థితిని విధించింది.
This post was last modified on May 17, 2026 2:49 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…