Trends

మళ్ళీ మొదలైన మణిపూర్ అల్లర్లు

ఈశాన్య భారతంలో నిత్యం ఎక్కడో ఒకచోట అల్లర్లు నిత్యకృత్యంగా మారిపోయాయి. రెండేళ్ల క్రితం మణిపూర్ లో రాజుకున్న రెండు తెగల వివాదం యావత్తు భారత దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. భద్రతా దళాలు రోజుల తరబడి శ్రమించి అక్కడి పరిస్థితులను చల్లార్చాయి. ఈ ఘటనలను మరిచిపోకముందే మరోమారు మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న భద్రతా దళాలపై అక్కడి నిరసనకారులు ఎదురు దాడులకు తెగబడుతున్నారు. వెరసి 2023 నాటి పరిస్థితులు మరోమారు దాపురిస్తాయా? అన్న దిశగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

2023లో రెండు తెగల మధ్య రాజుకున్న వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ ఘర్షణల్లో ఏకంగా 260 మంది చనిపోగా… 60 వేల మందిదాకా నిరాశ్రయులుగా మిగిలిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితులను చల్లబరిచే దిశగా పకడ్బందీ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘర్షణలు దాదాపుగా రెండేళ్ల పాటు కొనసాగిన వైనం కూడా యావత్తు దేశ ప్రజలను దిగ్భాంతికి గురి చేశాయి. 

తాజాగా మణిపూర్ లో మరోమారు అల్లర్లు చెలరేగాయి. శుక్రవారం మణిపూర్ కు చెందిన ట్రోంగ్లావోబీ ప్రాంతంలో ఇద్దరు పిల్లల హత్యలు ఉన్నట్టుండి పెద్ద ఘర్షణలకు తెర తీశాయి. బాధితుల తరఫున పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనలు రాజధాని ఇంపాల్ లోని తూర్పు ప్రాంతానికి కూడా విస్తరించాయి. అల్లర్లను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చల్లారినట్టు కనిపించినా.. ఇంకా చాలా ప్రాంతాల్లో పరిస్థితి ఉధ్రిక్తంగానే ఉంది.

This post was last modified on April 18, 2026 7:16 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Manipur

Recent Posts

ప‌వ‌న్‌కు అస‌లేమైంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోగ్యం గురించి శ‌నివారం సాయంత్రం సామాజిక మాధ్య‌మాల్లో ఒక్క‌సారిగా పెద్ద చ‌ర్చ మొద‌లైంది. ఉన్న‌ట్లుండి…

1 hour ago

మసూద డైరెక్టర్ ఎక్కడయ్యా?

తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…

1 hour ago

దురంధర్ 2 ముందుకు – పుష్ప 2 వెనక్కు

మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…

4 hours ago

బిల్లు వ్యతిరేకతపై విశ్లేషకులు ఏమంటున్నారు?

దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…

4 hours ago

ఏపీకి మోడీ వ‌రాలు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఏపీపై వ‌రాల జ‌ల్లు కురిపించింది. శ‌నివారం జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సుదీర్ఘ…

4 hours ago

జ‌గ‌న్ న‌చ్చాడా ప్ర‌కాష్‌రాజ్?

ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై బ‌హుభాషా న‌టుడు.. ప్ర‌కాష్‌రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రిని…

5 hours ago