మీ ఫోన్ నంబర్ ఎవరికీ తెలియకుండానే వాట్సాప్లో ఛాట్ చేసే రోజులు రాబోతున్నాయి. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ త్వరలో ‘యూజర్ నేమ్’ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు వాట్సాప్ వాడాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి, కానీ ఇకపై ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహాలో ఒక యూనిక్ పేరుతో అకౌంట్ ని వాడుకోవచ్చు. దీనివల్ల తెలియని వ్యక్తులకు మన వ్యక్తిగత కాంటాక్ట్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రైవసీని కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఊరట అని చెప్పొచ్చు.
2026 జూన్ నాటికి ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం మెసేజ్ పంపడమే కాకుండా, వాయిస్, వీడియో కాల్స్ కూడా ఈ యూజర్ నేమ్ ద్వారానే చేసుకోవచ్చు. వాట్సాప్ మొదలైనప్పటి నుంచి ఫోన్ నంబర్ ఆధారంగానే గుర్తింపు ఉండేది, కానీ ఇప్పుడు ఆ పద్ధతిలో భారీ మార్పు రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర యాప్స్లో ఈ సౌకర్యం ఉన్నప్పటికీ, వాట్సాప్ యూజర్లు దీని కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఫీచర్ ఒక ఛాయిస్ మాత్రమే. అంటే మీరు మీ ఫోన్ నంబర్ ద్వారానే కంటిన్యూ అవ్వాలా లేదా కొత్తగా యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలా అనేది మీ ఇష్టం. ఒకవేళ ఎవరి దగ్గరైనా మీ ఫోన్ నంబర్ ఇప్పటికే సేవ్ అయ్యి ఉంటే, వారు ఎప్పటిలాగే మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులకు మాత్రం నంబర్ బదులు మీ యూజర్ నేమ్ ఇస్తే సరిపోతుంది.
యూజర్ నేమ్స్ తో పాటు వాట్సాప్ ‘గెస్ట్ ఛాట్స్’ అనే మరో కొత్త ప్రయోగాన్ని కూడా చేస్తోంది. దీని ద్వారా వాట్సాప్ అకౌంట్ లేని వారు కూడా ఒక లింక్ ద్వారా బ్రౌజర్లో సంభాషణల్లో పాల్గొనవచ్చు. అయితే వీరికి కేవలం టెక్స్ట్ మెసేజ్ పంపే సౌకర్యం మాత్రమే ఉండవచ్చు. ఈ గెస్ట్ ఛాట్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో సురక్షితంగా ఉంటాయని తెలుస్తోంది. అకౌంట్ క్రియేట్ చేయకుండానే అవతలి వ్యక్తితో మాట్లాడాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
This post was last modified on March 22, 2026 12:05 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…