సోషల్ మీడియాల్లో రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఇప్పటికే రీల్స్ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసభ్య పదాలు.. చర్యలతో రీల్స్ను అనేక మంది ధ్వంసం చేస్తున్నారు. ఒక సదుద్దేశంతో రీల్స్ను తీసుకువచ్చినా.. దీనిలో అసభ్యకర, అభ్యంతరకర కంటెంట్ పెరిగిపోయింది. దీంతో రీల్స్ చూడాలంటేనే భయం వేసే పరిస్థితులు నేడు నెలకొన్నాయి.
ఇక, ఈ రీల్స్ మోజులో పడుతున్న యువతతో పాటు పలువురు మహిళలు కూడా ప్రాణాల మీదకి తెచ్చు కుంటున్నారు. ఇటీవల ఓ యువతి.. చెరువు గట్టుపై నిలబడి వయ్యారంగా రీల్స్ చేస్తుండగా.. ఆ గట్టు అంచు తెగిపోయి.. ఆమె ఒక్క ఉదుటున చెరువలో పడిప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఎక్కడో కాదు.. నిజామాబాద్లోనే జరిగింది.
మరో వ్యక్తి.. కరీంనగర్లో.. రైలు పట్టాలపై రైలు వేగాన్ని అనుసరిస్తూ.. పరిగెట్టి రీల్స్ చేయబోగా.. ఆ రైలే అతనిని పట్టాలపైకి లాగేసింది. ఫలితంగా.. కుటుంబంలో గర్భశోకం.
మరిన్ని చిత్రమైన ఘటనలు కూడా ఉన్నాయి. రీల్స్ యావలో పడి.. తనకు అన్నం పెట్టలేదని.. మహారాష్ట్రకు చెందిన ఓ భర్త.. తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీనిని కోర్టు కూడా సమర్థించడం.. గత నెల లోనే సంచలనం రేపింది.
ఇక, పెళ్లిళ్లలోనూ రీల్స్ తాకిడి పెరుగుతోంది. ఇటీవల గుజరాత్లో ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమార్తె రీల్స్ చేసింది. ఆమె.. చెంగుచెంగున గెంతుతూ చేసిన ఈ రీల్ చూసి.. మగ పెళ్లివారు పెళ్లి రద్దుచేసుకుని వెళ్లిపోయారు.
తాజాగా.. జరిగిన ఘటనలో సరదా కోసం చిత్రీకరించాలనుకున్న ఓ దృశ్యం చివరకు విషాదాంతమైంది. ఉత్తరప్రదేశ్లోని బాందా జిల్లాకు చెందిన 27 ఏళ్ల మోహిని ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే రీల్స్ చేసింది.
కానీ, ప్రమాదవ శాత్తు సదరు తాడు.. గట్టిగా బిగుసుకుంది. దీనిని గమనించకుండా.. ఆమె ఎత్తయిన స్టూల్పై నుంచి కిందికి దూకేసింది. అంతే.. ఇంకేముంది.. క్షణాల్లో ప్రాణాలు హరీ మన్నాయి. సో.. రీల్స్ మంచిదే అయినా.. రియల్ లైఫ్ను మించి మంచివి కాదన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
This post was last modified on February 7, 2026 2:59 pm
ఈ శుక్రవారం విడుదల కానున్న ఎపిక్ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ఇటీవల…
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా…
పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ…
AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అటవీ ప్రాంత ఐదు పిల్ల ఒరాంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. బడపై గ్రామం సమీపంలోని రణకథ…
భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ…