Trends

వివాహేతర సంబంధం.. చంపేస్తున్నారు

వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా, కేవలం సెక్స్ కోసమే అన్నట్లుగా వ్యవహరిస్తూ కొందరు పెళ్లయిన ప్రియురాళ్లు చేస్తున్న ఘాతుకాలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో నాలుగు ఘటనలు ఇలాంటివే వెలుగు చూడడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయా ఘటనలు వేర్వేరుగా ఉన్నా, అందరి లక్ష్యం వివాహేతర సంబంధమే కావడం గమనార్హం.

1) తమ్ముడితో కలిసి భర్త హత్య

తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన ఓ భార్య, తన భర్తను సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. ప్రకాశం జిల్లాలోని దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను, ఝాన్సికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఝాన్సీకి తన తమ్ముడి స్నేహితుడు సూర్యనారాయణతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలిసిన శ్రీను, తాను ప్రస్తుతం గంజాయి కేసులో రిమాండ్‌లో ఉన్నానని, బయటకు వస్తే చంపేస్తానని హెచ్చరించాడు. అయితే ఝాన్సీ ఈ పరిస్థితిని ఎదుర్కొనే బదులు భర్తనే హతమార్చేలా ప్లాన్ చేసింది. తమ్ముడితో కలిసి సుపారీ గ్యాంగుకు డబ్బులు ఇచ్చి, బెయిల్‌పై బయటకు తెచ్చి మరీ భర్తను మట్టుబెట్టించింది.

2) బిర్యానీలో మత్తిచ్చి

తన వివాహేతర సంబంధాన్ని భర్త పసిగట్టాడని భావించిన గుంటూరుకు చెందిన ఓ మహిళ, ప్రియుడితో కలిసి భర్తను అత్యంత పథకం ప్రకారం హత్య చేసింది. భర్త శారీరకంగా బలంగా ఉండటంతో మత్తు టాబ్లెట్లు తెప్పించుకుని, భర్తకు ఇష్టమైన బిర్యానీలో వాటిని కలిపింది.

ఆ తర్వాత మత్తు మందులు అందించిన ఆర్ ఎం పీ వైద్యుడు, ప్రియుడు, ఈమె కలిసి భర్తను గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన కూడా శనివారమే వెలుగులోకి వచ్చింది.

3) ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ

ఇది మరో షాకింగ్ ఘటన. కర్నూలుకు చెందిన ఓ యువతి, ఓ యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడు వృత్తిరీత్యా వైద్యుడు. కొన్నాళ్లకు అతడు మరో యువతిని, ఆమె కూడా వైద్యురాలే, వివాహం చేసుకున్నాడు. దీంతో కోపం, కసితో యువతి అతడి భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసింది.

“నావాడు నాకే సొంతం” అంటూ ప్రియుడి భార్యకు హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన పూర్తిగా ప్రణాళికాబద్ధంగా జరిగింది. వైద్యురాలు బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ప్రియుడి ప్రియురాలు మరో వాహనంతో ఢీకొట్టించి రోడ్డుపై పడేసింది. అనంతరం 108కు ఫోన్ చేసి, ఆమెను లోపలికి ఎక్కిస్తున్న సమయంలో హెచ్ ఐవీ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన కూడా శనివారమే వెలుగు చూసింది.

4) ప్రియుడి భార్యకు నిప్పు

తనకు, ప్రియుడికి మధ్య ఉన్న వివాహేతర సంబంధానికి అతడి భార్య అడ్డు వస్తోందని భావించిన ఓ పెళ్లయిన మహిళ, గుంటూరు జిల్లా చేబ్రోలులో ప్రియుడి ఇంటికి నిప్పంటించింది. ఈ ఘటన శనివారం జరిగింది. ఇంటికి నిప్పంటించిన సమయంలో ప్రియుడి భార్య, కుమారుడు, తల్లి ఇంట్లోనే ఉన్నారు.

ఈ ఘటనలో మొత్తం 10 మందికి గాయాలయ్యాయి. మొత్తంగా ఒకే రోజు నాలుగు ఘటనలు జరగడం, అవన్నీ వివాహేతర సంబంధాలతో ముడిపడి ఉండటం ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

This post was last modified on January 25, 2026 10:53 pm

Share

Recent Posts

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

12 minutes ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

2 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

2 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

3 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

4 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

6 hours ago