గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో టికెట్ కౌంటర్లో పనిచేసే సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన మాధురి, ఈ నెల 18న రాత్రి బిర్యానీలో ఏకంగా 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది.
నిద్రమాత్రల ప్రభావంతో భర్త స్పృహ కోల్పోయాక, రాత్రి 11:30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి తెల్లవార్లూ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. తెల్లవారుజామున తన భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది.
అయితే అంత్యక్రియలకు అరగంట ముందు మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అసలు కథ అడ్డం తిరిగింది. నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించారు. దీనితో ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది.
నేటి తరం సంబంధాల్లో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…