గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో టికెట్ కౌంటర్లో పనిచేసే సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన మాధురి, ఈ నెల 18న రాత్రి బిర్యానీలో ఏకంగా 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది.
నిద్రమాత్రల ప్రభావంతో భర్త స్పృహ కోల్పోయాక, రాత్రి 11:30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి తెల్లవార్లూ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. తెల్లవారుజామున తన భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది.
అయితే అంత్యక్రియలకు అరగంట ముందు మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అసలు కథ అడ్డం తిరిగింది. నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించారు. దీనితో ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది.
నేటి తరం సంబంధాల్లో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…