గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో టికెట్ కౌంటర్లో పనిచేసే సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన మాధురి, ఈ నెల 18న రాత్రి బిర్యానీలో ఏకంగా 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది.
నిద్రమాత్రల ప్రభావంతో భర్త స్పృహ కోల్పోయాక, రాత్రి 11:30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి తెల్లవార్లూ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. తెల్లవారుజామున తన భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది.
అయితే అంత్యక్రియలకు అరగంట ముందు మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అసలు కథ అడ్డం తిరిగింది. నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించారు. దీనితో ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది.
నేటి తరం సంబంధాల్లో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on January 22, 2026 11:05 am
తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…