గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఒక భార్య చేసిన ఘాతుకం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భర్తను అత్యంత క్రూరంగా అంతమొందించింది. భర్త చనిపోయిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా రాత్రంతా పో**ర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజుకు, లక్ష్మీమాధురికి 2007లో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయవాడలో టికెట్ కౌంటర్లో పనిచేసే సమయంలో మాధురికి సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన మాధురి, ఈ నెల 18న రాత్రి బిర్యానీలో ఏకంగా 20 నిద్రమాత్రలు కలిపి భర్తకు తినిపించింది.
నిద్రమాత్రల ప్రభావంతో భర్త స్పృహ కోల్పోయాక, రాత్రి 11:30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోగా, మాధురి తెల్లవార్లూ ఫోన్లో అసభ్యకర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం గమనార్హం. తెల్లవారుజామున తన భర్తకు గుండెపోటు వచ్చిందని నాటకమాడింది.
అయితే అంత్యక్రియలకు అరగంట ముందు మృతుడి స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అసలు కథ అడ్డం తిరిగింది. నాగరాజు చెవి నుంచి రక్తం రావడం గమనించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఛాతీ ఎముకలు విరిగి ఉండటం, గాలి ఆడకపోవడం వల్లే మరణం సంభవించిందని తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో విచారించారు. దీనితో ఆమె తన పాపాన్ని ఒప్పుకుంది.
నేటి తరం సంబంధాల్లో నైతిక విలువలు ఎంతలా పడిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
This post was last modified on January 22, 2026 11:05 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…