భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ అరుదైన గుర్తింపు పొందాడు.
వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్ల తర్వాత మైదానాన్ని వీడిన అతను, బ్యాటింగ్ చేసినా క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో మెడికల్ టీమ్ సూచన మేరకు అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుపులు మెరిపించిన బదోనీకి సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఆయుష్ బదోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 46 ఇన్నింగ్స్ ఆడి 963 పరుగులు చేశాడు, అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఉపయోగపడే ఈ యంగ్ ఆల్ రౌండర్ రాక జట్టుకు అదనపు బలం కానుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యువ ఆటగాడిని అదృష్టం వరించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లో గాయపడి రిషభ్ పంత్ సిరీస్ నుంచి తప్పుకోగా, ధ్రువ్ జురెల్ను అతని స్థానంలో తీసుకున్నారు.
మరోవైపు టీ20 సిరీస్కు కూడా యువ ఆటగాడు తిలక్ వర్మ గాయంతో దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మొదటి వన్డేలో కోహ్లీ (94), గిల్ (56) అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మక రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో బదోనీ తుది జట్టులో చోటు సంపాదించి అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on January 13, 2026 12:17 am
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…