Trends

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ అరుదైన గుర్తింపు పొందాడు.

వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్ల తర్వాత మైదానాన్ని వీడిన అతను, బ్యాటింగ్ చేసినా క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో మెడికల్ టీమ్ సూచన మేరకు అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుపులు మెరిపించిన బదోనీకి సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఆయుష్ బదోనీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 46 ఇన్నింగ్స్ ఆడి 963 పరుగులు చేశాడు, అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే ఈ యంగ్ ఆల్ రౌండర్ రాక జట్టుకు అదనపు బలం కానుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యువ ఆటగాడిని అదృష్టం వరించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి రిషభ్ పంత్ సిరీస్ నుంచి తప్పుకోగా, ధ్రువ్ జురెల్‌ను అతని స్థానంలో తీసుకున్నారు.

మరోవైపు టీ20 సిరీస్‌కు కూడా యువ ఆటగాడు తిలక్ వర్మ గాయంతో దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మొదటి వన్డేలో కోహ్లీ (94), గిల్ (56) అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మక రెండో వన్డే జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో బదోనీ తుది జట్టులో చోటు సంపాదించి అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

3 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

4 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

5 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

6 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

6 hours ago