భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో యువ సంచలనం ఆయుష్ బదోనీని బీసీసీఐ ఎంపిక చేసింది. 2026 సంవత్సరంలో భారత జాతీయ జట్టుకు ఎంపికైన తొలి కొత్త ఆటగాడిగా బదోనీ అరుదైన గుర్తింపు పొందాడు.
వడోదరలో జరిగిన మొదటి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో సుందర్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఐదు ఓవర్ల తర్వాత మైదానాన్ని వీడిన అతను, బ్యాటింగ్ చేసినా క్రీజులో అసౌకర్యంగా కనిపించాడు. దీంతో మెడికల్ టీమ్ సూచన మేరకు అతడు మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున మెరుపులు మెరిపించిన బదోనీకి సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఆయుష్ బదోనీ ఇప్పటివరకు ఐపీఎల్లో 46 ఇన్నింగ్స్ ఆడి 963 పరుగులు చేశాడు, అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఉపయోగపడే ఈ యంగ్ ఆల్ రౌండర్ రాక జట్టుకు అదనపు బలం కానుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యువ ఆటగాడిని అదృష్టం వరించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లో గాయపడి రిషభ్ పంత్ సిరీస్ నుంచి తప్పుకోగా, ధ్రువ్ జురెల్ను అతని స్థానంలో తీసుకున్నారు.
మరోవైపు టీ20 సిరీస్కు కూడా యువ ఆటగాడు తిలక్ వర్మ గాయంతో దూరమవ్వడం జట్టుకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. మొదటి వన్డేలో కోహ్లీ (94), గిల్ (56) అద్భుత ప్రదర్శనతో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్ నిర్ణయాత్మక రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో బదోనీ తుది జట్టులో చోటు సంపాదించి అరంగేట్రం చేస్తాడో లేదో చూడాలి.
This post was last modified on January 13, 2026 12:17 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…