Trends

ఐపీఎల్-14 ఇండియాలోనే.. ఇదిగో రుజువు

ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌టం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో లీగ్‌ను నిర్వ‌హించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే క‌రోనా క‌ష్ట కాలంలో జ‌నాల‌కు గొప్ప ఉప‌శ‌మ‌నంగా క‌నిపించిన ఐపీఎల్ సూప‌ర్ హిట్ట‌యింది. అంచ‌నాల్ని మించి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. భారీగా ఆదాయం ఆర్జించి పెట్టింది.

ఈ ఉత్సాహంలో కొత్త ఏడాదిలో షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్, మే నెల‌ల్లోనే టోర్నీనిర్వ‌‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఐతే ఇండియాలో క‌రోనా ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 14వ సీజ‌న్‌ను స్వ‌దేశంలో నిర్వ‌హిస్తారా.. మ‌రోసారి యూఏఈకి లీగ్‌ను తీసుకెళ్తారా అన్న ఉత్కంఠ నెల‌కొంది అంద‌రిలో.

ఐతే ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే అని బీసీసీఐ సంకేతాలు ఇచ్చేసింది. డోలాయ‌మానంలో ఉన్న‌ ఇంగ్లాండ్‌తో భార‌త్ సిరీస్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేయ‌డ‌మే ఇందుకు సూచిక‌. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భార‌త్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. మార్చి 28న సిరీస్ ముగుస్తుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌తో ఇంగ్లాండ్ వ‌రుస‌గా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడుతుంది.

ఐపీఎల్ ఏప్రిల్ తొలి, రెండో వారంలో ఆరంభం కావాల్సి ఉండ‌గా.. దానికి వారం ప‌ది రోజుల ముందు అంత‌ర్జాతీయ సిరీస్‌ను ఇండియాలో ఆడిస్తున్నారంటే ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి అభ్యంత‌రాలేముంటాయి? యూఏఈలో లీగ్ ఆడాలంటే టోర్నీ ఆరంభానికి మూణ్నాలుగు వారాల ముందే అక్క‌డికెళ్లాలి.

మార్చి 28 వ‌ర‌కు మ‌న‌వాళ్లు ఇండియాలో సిరీస్ ఆడ‌నున్నారంటే ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ల‌ర‌న్న‌మాట‌. కాక‌పోతే ఐపీఎల్‌-14ను ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హిస్తారా.. లేక అభిమానుల‌ను అనుమ‌తిస్తారా అన్న‌దే ఇక తేలాల్సి ఉంది.

This post was last modified on December 11, 2020 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

58 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

1 hour ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

3 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

4 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

4 hours ago