Trends

ఐపీఎల్-14 ఇండియాలోనే.. ఇదిగో రుజువు

ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌టం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో లీగ్‌ను నిర్వ‌హించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే క‌రోనా క‌ష్ట కాలంలో జ‌నాల‌కు గొప్ప ఉప‌శ‌మ‌నంగా క‌నిపించిన ఐపీఎల్ సూప‌ర్ హిట్ట‌యింది. అంచ‌నాల్ని మించి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. భారీగా ఆదాయం ఆర్జించి పెట్టింది.

ఈ ఉత్సాహంలో కొత్త ఏడాదిలో షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్, మే నెల‌ల్లోనే టోర్నీనిర్వ‌‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఐతే ఇండియాలో క‌రోనా ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 14వ సీజ‌న్‌ను స్వ‌దేశంలో నిర్వ‌హిస్తారా.. మ‌రోసారి యూఏఈకి లీగ్‌ను తీసుకెళ్తారా అన్న ఉత్కంఠ నెల‌కొంది అంద‌రిలో.

ఐతే ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే అని బీసీసీఐ సంకేతాలు ఇచ్చేసింది. డోలాయ‌మానంలో ఉన్న‌ ఇంగ్లాండ్‌తో భార‌త్ సిరీస్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేయ‌డ‌మే ఇందుకు సూచిక‌. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భార‌త్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. మార్చి 28న సిరీస్ ముగుస్తుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌తో ఇంగ్లాండ్ వ‌రుస‌గా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడుతుంది.

ఐపీఎల్ ఏప్రిల్ తొలి, రెండో వారంలో ఆరంభం కావాల్సి ఉండ‌గా.. దానికి వారం ప‌ది రోజుల ముందు అంత‌ర్జాతీయ సిరీస్‌ను ఇండియాలో ఆడిస్తున్నారంటే ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి అభ్యంత‌రాలేముంటాయి? యూఏఈలో లీగ్ ఆడాలంటే టోర్నీ ఆరంభానికి మూణ్నాలుగు వారాల ముందే అక్క‌డికెళ్లాలి.

మార్చి 28 వ‌ర‌కు మ‌న‌వాళ్లు ఇండియాలో సిరీస్ ఆడ‌నున్నారంటే ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ల‌ర‌న్న‌మాట‌. కాక‌పోతే ఐపీఎల్‌-14ను ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హిస్తారా.. లేక అభిమానుల‌ను అనుమ‌తిస్తారా అన్న‌దే ఇక తేలాల్సి ఉంది.

This post was last modified on December 11, 2020 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago