Trends

ఐపీఎల్-14 ఇండియాలోనే.. ఇదిగో రుజువు

ఈ ఏడాది వేస‌విలో జ‌ర‌గాల్సిన ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ 13వ సీజ‌న్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డ‌టం.. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో యూఏఈలో ప్రేక్ష‌కులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో లీగ్‌ను నిర్వ‌హించ‌డం తెలిసిన సంగ‌తే. ఐతే క‌రోనా క‌ష్ట కాలంలో జ‌నాల‌కు గొప్ప ఉప‌శ‌మ‌నంగా క‌నిపించిన ఐపీఎల్ సూప‌ర్ హిట్ట‌యింది. అంచ‌నాల్ని మించి ఆద‌ర‌ణ సంపాదించుకుంది. భారీగా ఆదాయం ఆర్జించి పెట్టింది.

ఈ ఉత్సాహంలో కొత్త ఏడాదిలో షెడ్యూల్ ప్ర‌కారం ఏప్రిల్, మే నెల‌ల్లోనే టోర్నీనిర్వ‌‌హించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ఐతే ఇండియాలో క‌రోనా ప్ర‌భావం ఇంకా కొన‌సాగుతున్న నేప‌థ్యంలో 14వ సీజ‌న్‌ను స్వ‌దేశంలో నిర్వ‌హిస్తారా.. మ‌రోసారి యూఏఈకి లీగ్‌ను తీసుకెళ్తారా అన్న ఉత్కంఠ నెల‌కొంది అంద‌రిలో.

ఐతే ఈసారి ఐపీఎల్ ఇండియాలోనే అని బీసీసీఐ సంకేతాలు ఇచ్చేసింది. డోలాయ‌మానంలో ఉన్న‌ ఇంగ్లాండ్‌తో భార‌త్ సిరీస్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేయ‌డ‌మే ఇందుకు సూచిక‌. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భార‌త్‌లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఆరంభం కానుంది. మార్చి 28న సిరీస్ ముగుస్తుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌తో ఇంగ్లాండ్ వ‌రుస‌గా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడుతుంది.

ఐపీఎల్ ఏప్రిల్ తొలి, రెండో వారంలో ఆరంభం కావాల్సి ఉండ‌గా.. దానికి వారం ప‌ది రోజుల ముందు అంత‌ర్జాతీయ సిరీస్‌ను ఇండియాలో ఆడిస్తున్నారంటే ఐపీఎల్ నిర్వ‌హించ‌డానికి అభ్యంత‌రాలేముంటాయి? యూఏఈలో లీగ్ ఆడాలంటే టోర్నీ ఆరంభానికి మూణ్నాలుగు వారాల ముందే అక్క‌డికెళ్లాలి.

మార్చి 28 వ‌ర‌కు మ‌న‌వాళ్లు ఇండియాలో సిరీస్ ఆడ‌నున్నారంటే ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్ల‌ర‌న్న‌మాట‌. కాక‌పోతే ఐపీఎల్‌-14ను ఖాళీ స్టేడియాల్లో నిర్వ‌హిస్తారా.. లేక అభిమానుల‌ను అనుమ‌తిస్తారా అన్న‌దే ఇక తేలాల్సి ఉంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

39 minutes ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

42 minutes ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

2 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

6 hours ago