వైసీపీ అధినేత జగన్పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ప్రజలపై నిర్బంధాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఆగడాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తోంది.
జనవరి 15 నుంచి ప్రజల మధ్యకు టీడీపీ నేతలు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో, దీనిపై కసరత్తు పెంచిన పార్టీ నేతలు ఐదు కీలక అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు.
1) తిరుమల:
పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైసీపీ హయాంలో ఏ విధంగా భ్రష్టుపట్టించారో మరోసారి ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి దొంగతనం, అలాగే అన్యమత ప్రచారాల అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే సమయంలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రజలకు చెబుతారు.
2) అమరావతి:
మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని అటకెక్కించిన తీరును ప్రజలకు మరోసారి వివరించనున్నారు. ప్రస్తుతం అమరావతి ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా ప్రజలకు తెలియజేస్తారు. అమరావతిని నాశనం చేయడం ద్వారా జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారన్న వాదనను బలంగా తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.
3) రుషికొండ:
విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండను తొలిచేసి ఎందుకు కొరగాని ప్యాలెస్ నిర్మించారన్న అంశాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా వివరించనుంది. ఈ ద్వారా 550 కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేశారో కూడా ప్రజలకు చెప్పనున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల ధనాన్ని ఎలా దోచుకున్నారో కూడా వివరించాలన్నది టీడీపీ ఆలోచన.
4) శవం డోర్ డెలివరీ:
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనను కూడా ప్రజలకు వివరించనున్నారు. అలాగే అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల ఎలా వ్యవహరించారో సంబంధించిన న్యూడ్ వీడియోల అంశాన్ని మరోసారి ప్రజల ముందుకు తీసుకురావాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
5) చంద్రబాబు అరెస్టు:
చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన తీరు, ఆయన్ను జైలులో పెట్టిన విషయాలను కూడా ప్రజల మధ్యకు తీసుకురానున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కుటుంబంపై జరిగిన విమర్శలను కూడా వివరించనున్నారు. వైసీపీ పాజిటివిటీని సాధ్యమైనంతవరకు తగ్గించాలనే లక్ష్యంతో టీడీపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.
ఈ ప్రణాళికకు చంద్రబాబు ఆమోదం లభిస్తే, జనవరి నుంచి వచ్చే మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.
This post was last modified on January 6, 2026 10:21 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…