Trends

పండగ తరువాత జగన్‌ను వెంటాడాలి: టీడీపీ నిర్ణ‌యం!

వైసీపీ అధినేత జగన్‌పై విమర్శల జోరు పెంచాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఎలా ఉన్నా, గత వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, ప్రజలపై నిర్బంధాలు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన ఆగడాలను మరోసారి ప్రజలకు గుర్తు చేయాలని భావిస్తోంది.

జనవరి 15 నుంచి ప్రజల మధ్యకు టీడీపీ నేతలు వెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించుకున్న నేపథ్యంలో, దీనిపై కసరత్తు పెంచిన పార్టీ నేతలు ఐదు కీలక అంశాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయనున్నారు.

1) తిరుమల:
పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని వైసీపీ హయాంలో ఏ విధంగా భ్రష్టుపట్టించారో మరోసారి ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతున్న లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం, పరకామణి దొంగతనం, అలాగే అన్యమత ప్రచారాల అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అదే సమయంలో ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను కూడా ప్రజలకు చెబుతారు.

2) అమరావతి:
మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని అటకెక్కించిన తీరును ప్రజలకు మరోసారి వివరించనున్నారు. ప్రస్తుతం అమరావతి ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా ప్రజలకు తెలియజేస్తారు. అమరావతిని నాశనం చేయడం ద్వారా జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారన్న వాదనను బలంగా తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించింది.

3) రుషికొండ:
విశాఖలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండను తొలిచేసి ఎందుకు కొరగాని ప్యాలెస్ నిర్మించారన్న అంశాన్ని ప్రజలకు మరింత సమర్థవంతంగా వివరించనుంది. ఈ ద్వారా 550 కోట్ల రూపాయల ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేశారో కూడా ప్రజలకు చెప్పనున్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజల ధనాన్ని ఎలా దోచుకున్నారో కూడా వివరించాలన్నది టీడీపీ ఆలోచన.

4) శవం డోర్ డెలివరీ:
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్‌ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఘటనను కూడా ప్రజలకు వివరించనున్నారు. అలాగే అప్పటి ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల ఎలా వ్యవహరించారో సంబంధించిన న్యూడ్ వీడియోల అంశాన్ని మరోసారి ప్రజల ముందుకు తీసుకురావాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.

5) చంద్రబాబు అరెస్టు:
చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన తీరు, ఆయన్ను జైలులో పెట్టిన విషయాలను కూడా ప్రజల మధ్యకు తీసుకురానున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కుటుంబంపై జరిగిన విమర్శలను కూడా వివరించనున్నారు. వైసీపీ పాజిటివిటీని సాధ్యమైనంతవరకు తగ్గించాలనే లక్ష్యంతో టీడీపీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

ఈ ప్రణాళికకు చంద్రబాబు ఆమోదం లభిస్తే, జనవరి నుంచి వచ్చే మూడు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.

This post was last modified on January 6, 2026 10:21 am

Share

Recent Posts

అప్పుడే అవ్వగొట్టేసిన క్రిష్?

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…

29 minutes ago

ఎక్స్‌ప్రెస్ దర్శకుడికి హిట్టు దక్కేనా

మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…

1 hour ago

స్నేహం కోసం… అల్లు అర్జున్ ఆదర్శం!

స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…

2 hours ago

ఒక జడ్జి వ్యాఖ్యలను ఖండించిన మరో జడ్జి

ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…

2 hours ago

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…

3 hours ago

బరువు తగ్గే ఔషధం వేసుకుంటే జుట్టు ఊడిపోతుంది

అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…

3 hours ago