Trends

అసూయతో పిల్లలను చంపిన కిల్లర్ ఆంటీ!

హర్యానాలో జరిగిన ఈ ఘోరం గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అందంగా ఉన్నారన్న ఒక్క కారణంతో చిన్న పిల్లలను టార్గెట్ చేసి చంపేసింది ఓ మహిళ. ఆమె పేరు పూనమ్. గత రెండేళ్లలో ఏకంగా నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇందులో ఆమె సొంత కొడుకు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆమె ఎందుకిలా చేసింది అంటే.. పోలీసుల విచారణలో “బ్యూటీ కాంప్లెక్స్” అనే వింత కారణం బయటపడింది. అంటే నా కంటే ఎవరూ అందంగా ఉండకూడదు అనే అసూయ, ఆలోచన ఆమెకు మీతిమీరినట్లు గుర్తించారు.

పూనమ్ టార్గెట్ చేసింది ఎక్కువగా ఆడపిల్లలనే. తనకంటే ఆ పిల్లలు అందంగా ఉన్నారనే అసూయతో రగిలిపోయేదట. ఆ జెలసీతోనే వరుసగా ఇషిక (9), జియా (8) అనే చిన్నారులను చంపేసింది. తాజాగా సోమవారం నాడు తన మేనకోడలు విధి (6) ని కూడా అదే కారణంతో చంపేసింది. ఒక ఫంక్షన్ కోసం రెడీ అయిన ఆ పాపను, మాయమాటలు చెప్పి స్టోర్ రూమ్‌కి తీసుకెళ్లి, నీళ్ల టబ్‌లో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది.

ఈ సీరియల్ కిల్లర్ కథలో అత్యంత దారుణమైన ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తన సొంత కొడుకు శుభమ్ (4) ను కూడా వదలలేదు. అయితే కొడుకును చంపడానికి కారణం అందం కాదు. మొదటి హత్య చేసినప్పుడు అందరికీ తనపై అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని పక్కదారి పట్టించడానికే, సొంత కొడుకును చంపి “నా కొడుకు కూడా చనిపోయాడు, నేనే బాధితురాలిని” అని డ్రామా ఆడింది. తనను ఎవరూ అనుమానించకూడదనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

నిజానికి విధి అనే పాపను చంపడానికి పూనమ్ 2021లోనే స్కెచ్ వేసింది. అప్పట్లో ఆ పాప ముఖంపై మరుగుతున్న టీ పోసింది. అప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిందని కుటుంబం నమ్మింది. కానీ పాప తండ్రి సందీప్‌కి మాత్రం అప్పుడే డౌట్ వచ్చింది. అతను ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. వారి నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది.

చివరికి పోలీసులు పూనమ్‌ను అరెస్ట్ చేయడంతో ఈ సీరియల్ మర్డర్స్ గుట్టు రట్టయింది. తన అందం తక్కువైపోతుందన్న భావమే ఇంతటి ఘోరాలకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు. “కేవలం అసూయతో నా కూతురిని చంపేసింది, ఆమెకు ఉరిశిక్ష వేయాలి” అని విధి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె బయట ఉంటే ఇంకెంతమంది పిల్లలు బలయ్యేవారో అని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on December 5, 2025 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

50 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago