Trends

అసూయతో పిల్లలను చంపిన కిల్లర్ ఆంటీ!

హర్యానాలో జరిగిన ఈ ఘోరం గురించి వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అందంగా ఉన్నారన్న ఒక్క కారణంతో చిన్న పిల్లలను టార్గెట్ చేసి చంపేసింది ఓ మహిళ. ఆమె పేరు పూనమ్. గత రెండేళ్లలో ఏకంగా నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుంది. ఇందులో ఆమె సొంత కొడుకు కూడా ఉండటం గమనార్హం. అసలు ఆమె ఎందుకిలా చేసింది అంటే.. పోలీసుల విచారణలో “బ్యూటీ కాంప్లెక్స్” అనే వింత కారణం బయటపడింది. అంటే నా కంటే ఎవరూ అందంగా ఉండకూడదు అనే అసూయ, ఆలోచన ఆమెకు మీతిమీరినట్లు గుర్తించారు.

పూనమ్ టార్గెట్ చేసింది ఎక్కువగా ఆడపిల్లలనే. తనకంటే ఆ పిల్లలు అందంగా ఉన్నారనే అసూయతో రగిలిపోయేదట. ఆ జెలసీతోనే వరుసగా ఇషిక (9), జియా (8) అనే చిన్నారులను చంపేసింది. తాజాగా సోమవారం నాడు తన మేనకోడలు విధి (6) ని కూడా అదే కారణంతో చంపేసింది. ఒక ఫంక్షన్ కోసం రెడీ అయిన ఆ పాపను, మాయమాటలు చెప్పి స్టోర్ రూమ్‌కి తీసుకెళ్లి, నీళ్ల టబ్‌లో ముంచి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది.

ఈ సీరియల్ కిల్లర్ కథలో అత్యంత దారుణమైన ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తన సొంత కొడుకు శుభమ్ (4) ను కూడా వదలలేదు. అయితే కొడుకును చంపడానికి కారణం అందం కాదు. మొదటి హత్య చేసినప్పుడు అందరికీ తనపై అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని పక్కదారి పట్టించడానికే, సొంత కొడుకును చంపి “నా కొడుకు కూడా చనిపోయాడు, నేనే బాధితురాలిని” అని డ్రామా ఆడింది. తనను ఎవరూ అనుమానించకూడదనే ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

నిజానికి విధి అనే పాపను చంపడానికి పూనమ్ 2021లోనే స్కెచ్ వేసింది. అప్పట్లో ఆ పాప ముఖంపై మరుగుతున్న టీ పోసింది. అప్పుడు అది ప్రమాదవశాత్తు జరిగిందని కుటుంబం నమ్మింది. కానీ పాప తండ్రి సందీప్‌కి మాత్రం అప్పుడే డౌట్ వచ్చింది. అతను ఎంత చెప్పినా కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. వారి నిర్లక్ష్యమే ఇప్పుడు ఆ చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది.

చివరికి పోలీసులు పూనమ్‌ను అరెస్ట్ చేయడంతో ఈ సీరియల్ మర్డర్స్ గుట్టు రట్టయింది. తన అందం తక్కువైపోతుందన్న భావమే ఇంతటి ఘోరాలకు దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు. “కేవలం అసూయతో నా కూతురిని చంపేసింది, ఆమెకు ఉరిశిక్ష వేయాలి” అని విధి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె బయట ఉంటే ఇంకెంతమంది పిల్లలు బలయ్యేవారో అని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on December 5, 2025 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

13 minutes ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

30 minutes ago

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

2 hours ago

అసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…

2 hours ago

ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే..…

3 hours ago

రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…

4 hours ago