ఎలాన్ మస్క్.. ఈ కాలంలో ఆయన పేరు తెలియనివారు ఉండరు. టెస్లా, స్పేస్ఎక్స్, ట్విట్టర్ (ఎక్స్),ఎక్స్ ఏఐ వంటి కంపెనీలకు నాయకత్వం వహించి గుర్తింపు పొందారు. ఆయన దక్షిణాఫ్రికాలో జన్మించిన కెనడియన్- అమెరికన్ వ్యాపారవేత్త, ఇంజనీర్. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన తాజాగా భారతీయ మూలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు పేరులో శేఖర్ అని ఉండడంతో పాటు పలు విషయాలను వెల్లడించారు. మాస్క్ భాగస్వామి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్. ఆమెకు భారతీయ మూలాలు ఉన్నాయి.
ఆమెకు పూర్వీకుల ద్వారానే భారత్తో సంబంధం ఉంది, శివోన్ జిలిస్ కెనడాలోనే పెరిగారని మస్క్ స్పష్టం చేశారు. చాలాకాలంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో నిపుణురాలిగా పనిచేస్తున్నారు. వారి కుమారుల్లో ఒకరికి నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ‘శేఖర్’ అని మధ్య పేరుగా పెట్టామని వెల్లడించారు.
నక్షత్రాల పరిణామ క్రమంపై చేసిన విశేష పరిశోధనలకు గానూ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. అమెరికాలోని భారతీయ నిపుణులపై కూడా మస్క్ ప్రశంసలు కురిపించారు. వారి వల్ల అమెరికాకు ఎంతో ప్రయోజనం కలిగిందని అన్నారు. అయితే, హెచ్-1బీ వీసా వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేశారని కూడా చెప్పారు. జెరోధా సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్ కాస్ట్లో పాల్గొన్న మస్క్ అనేక అంశాలపై తన మనసులో మాటను పంచుకున్నారు.
This post was last modified on December 1, 2025 10:29 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…